Filters

Channels
Topics
Other Filters

YS Jagan AP local polls: ఏపీ స్థానిక పోరులో 34 శాతం బీసీ రిజర్వేషన్ మంటలు - చంద్రబాబు పందెం-జగన్ మైండ్ గేమ్!

34 percent BC quota : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల వివాదం నడుస్తోంది. చంద్రబాబు జీవో, జగన్ విమర్శలు, సుప్రీంకోర్టు 50% సీలింగ్ చట్టపరమైన అంశాలే దీనికి కారణం. 50 percent reservation limit BC quota:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూ  ఉత్కంఠ నెలకొంది.  కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసినా ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలు జరగవు.. బీసీలకు ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్లను కోర్టు కొట్టేస్తుంది, ఆ తర్వాత నెపాన్ని న్యాయస్థానాలపైకి నెట్టి ప్రభుత్వం నాటకాడుతుంది  అని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరోవైపు,  ఎన్ని న్యాయపరమైన అడ్డంకులు వచ్చినా బీసీలకు 34 శాతం కోటా అమలు చేసి తీరుతాం అని టీడీపీ నాయకత్వం స్పష్టం చేస్తూ 'జయహో బీసీ' సభల ద్వారా తమ బీసీ ఓటు బ్యాంక్‌ను పటిష్టం చేసుకునే పనిలో పడింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ వివాదం ఏమిటి? చంద్రబాబు సవాలు వెనుక ఉన్న రాజకీయ వ్యూహమేంటి?           ఏమిటీ 34 శాతం బీసీ రిజర్వేషన్ల వివాదం?  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ  చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జీవోలు విడుదల చేసింది. అయితే, సుప్రీంకోర్టు గతంలో   పలు తీర్పుల్లో.. ఎస్సీ, ఎస్టీ, బీసీల స్థానిక సంస్థల రిజర్వేషన్ల మొత్తం శాతాన్ని 50 శాతం పరిమితి దాటకూడదని స్పష్టమైన గీత గీసింది. ప్రస్తుతం ఏపీలో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6% రిజర్వేషన్లు ఉన్నందున, బీసీలకు 34% ఇస్తే మొత్తం రిజర్వేషన్లు 55% నుండి 61% వరకు చేరుకుంటాయి. 2019లో కూడా అప్పటి ప్రభుత్వం 34% ఇస్తే హైకోర్టు ,  సుప్రీంకోర్టులు దాన్ని కొట్టివేశాయి. దీనివల్ల రిజర్వేషన్లు 50% దాటితే న్యాయపరంగా మళ్లీ చిక్కులు వస్తాయన్నది జగన్ వాదనకు ప్రాతిపదిక.  సాధ్యం కాదని తెలిసి కూడా చంద్రబాబు ఎందుకు జీవో ఇచ్చారు?  చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడైన నాయకుడు. కోర్టు తీర్పుల పరిమితి ఆయనకు తెలియనిది కాదు. అయినా 34% జీవో ఇవ్వడం వెనుక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తామని కూటమి హామీ ఇచ్చింది.  ప్రభుత్వం తమ వైపు నుంచి 34% అమలుకు సిద్ధపడింది అన్న సందేశాన్ని ప్రజలకు ఇవ్వడం. ఒకవేళ కోర్టు దీనిని అడ్డుకుంటే,  మేము ఇవ్వాలనుకున్నాం కానీ న్యాయస్థానాల పరిమితుల వల్ల కుదరలేదు  అని చెప్పి బీసీల్లో సానుభూతి సాధించడం. సీలు టీడీపీకి సాంప్రదాయ వెన్నెముక. జీవో ఇవ్వడం, సభలు నిర్వహించడం ద్వారా తమ ప్రభుత్వం బీసీల పక్షపాతి అని బలంగా స్థాపించడం.  జగన్ 'ఎన్నికలు జరగవు' అనడం వెనుక మైండ్ గేమ్ ఏమిటి?  వైఎస్ జగన్ విమర్శలు కేవలం న్యాయ సూత్రాల గురించే కావు. దాని వెనుక స్పష్టమైన ప్రతిపక్ష వ్యూహం దాగి ఉంది. 2019-2024 మధ్య వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం 50% పరిమితికి లోబడి బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించి ఎన్నికలు నిర్వహించింది. అప్పట్లో టీడీపీ దీనిని  బీసీల నోళ్లు కొట్టారు  అని విమర్శించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 34% జీవో ఇస్తే, తాము గతంలో చేసింది కోర్టు నిబంధనల కోసమేనని నిరూపించుకోవాల్సిన అవసరం జగన్‌కు వచ్చింది. అలాగే, రిజర్వేషన్ల వివాదం వల్ల ఎన్నికలు ఆలస్యమైతే, కూటమి ప్రభుత్వం ఎన్నికల నుంచి పారిపోతోందని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది వైఎస్‌ఆర్‌సీపీ ఆలోచన.  కోర్టులు ఈ జీవోను అనుమతించే అవకాశం ఉందా?    న్యాయ కోణం నుంచి చూస్తే,  ఎంపిక చేసిన ప్రాతిపదికన ఎంపిరికల్ డేటా అంటే సామాజిక, ఆర్థిక సర్వే డేటా  ఆధారంగా బీసీల వెనుకబాటుతనాన్ని నిరూపిస్తే తప్ప 50% సీలింగ్‌ దాటడం సాధ్యం కాదు. ఈ విషయంపై ఏపీ హైకోర్టు కూడా ప్రభుత్వం వైపు నుంచి ఆధారాలను, ఎంపిరికల్ డేటాను కోరింది. ప్రత్యేక కమిషన్ల నివేదికలు లేకుండా జీవో ఆధారంగా 50% మించి రిజర్వేషన్లు ఇస్తే, గతం తరహాలోనే న్యాయస్థానాలు దానిని నిలిపివేసే  అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏపీ స్థానిక పోరులో బీసీ రిజర్వేషన్ల అంశం చట్టపరమైన సవాలు కంటే రాజకీయ అస్త్రంగా ఎక్కువ ఉపయోగపడుతోంది. 34% కోటాను దక్కించుకోవడం ద్వారా బీసీల గుండెల్లో చెరగని ముద్ర వేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంటే.. ఇది సాధ్యం కాని  రాజకీయ గిమ్మిక్  అని తేల్చిచెప్పడం ద్వారా టీడీపీ-బీజేపీ-జనసేనల ఇమేజ్‌ను దెబ్బతీయాలని వైఎస్‌ఆర్‌సీపీ చూస్తోంది. అంతిమంగా, కోర్టు ఇచ్చే తీర్పు స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను నిర్ణయించడమే కాకుండా, రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో బీసీ ఓటు బ్యాంక్ ఎటువైపు మొగ్గుతుందో స్పష్టం చేయనుంది.

Dhiraj Bommadevara Wins Gold: స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు

మెక్సికోలో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్‌-2026 రికర్వ్‌ విభాగంలో స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర, ఈ ఘనత సాధించిన తొలి భారత పురుష ఆర్చర్‌గా చరిత్ర సృష్టించారు. అమరావతి: మెక్సికోలోని సాల్టిల్లోలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్‌ ఫైనల్‌-2026లో భారత్ అద్భుతం చేసింది. తెలుగు తేజం, భారత ఆర్చర్‌ ధీరజ్‌ బొమ్మదేవర స్వర్ణాన్ని సాధించారు. పురుషుల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో గోల్డ్ సాధించిన తొలి భారత పురుష ఆర్చర్‌గా నిలిచి దేశం గర్వించేలా చేశారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న ధీరజ్‌ వరల్డ్ కప్ ఫైనల్లో జపాన్‌కు చెందిన నకనిషి జున్యాపై ఉత్కంఠభరిత పోరులో గెలుపొందారు. 5 సెట్ల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 5-5తో స్కోరు సమం కావడంతో షూట్ ఆఫ్ నిర్వహించారు. విజేతను తేల్చే షూట్‌ఆఫ్‌లో ధీరజ్‌ 10 పాయింట్లు కొట్టగా, ప్రత్యర్థి నకనిషి జున్యా 9 పాయింట్లు నెగ్గడంతో భారత ఆర్చర్ స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో ప్రపంచ కప్‌ ఫైనల్‌లో పురుషుల రికర్వ్‌ విభాగంలో స్వర్ణం నెగ్గిన తొలి భారత ఆర్చర్‌గా చరిత్ర సృష్టించారు. ధీరజ్ బొమ్మదేవర స్వర్ణం నెగ్గి సరికొత్త చరిత్ర సృష్టించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ ఆర్చరీ సాధన మైదానం నుంచి మెక్సికోలో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్ గ్లోబల్ వేదిక వరకు ఎదగడాన్ని హైలైట్ చేశారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్ వ్యక్తిగత విభాగంలో రికర్వ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర అని కొనియాడారు. సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా ధీరజ్ బొమ్మదేవరకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.