Filters

Channels
Topics
Other Filters

Polavaram MLA Chirri Balaraju: సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్

రిటైర్డ్ టీచర్ సమస్యపై ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సామాన్యుడిలా మారువేషంలో బుట్టాయగూడెం ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళ్లి మెరుపు తనిఖీ చేశారు. Polavaram MLA Chirri Balaraju | పోలవరం: ఏలూరు జిల్లాలో పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వినూత్న రీతిలో రంగంలోకి దిగారు. ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా బుట్టాయగూడెం తహసీల్దార్ కార్యాలయానికి ఒక సామాన్య పౌరుడిలా మారువేషంలో వెళ్లి అధికారులతో పాటు ప్రజలును ఆశ్చర్యపరిచారు. స్థానిక రిటైర్డ్ టీచర్ ఒకరు తన భూమికి సంబంధించిన పని కోసం ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా అధికారులు పట్టించుకోకపోలేదు. దాంతో విసుగు చెందిన ఆయన చివరికి కూటమి ఎమ్మెల్యేను ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకున్నారు. అధికారుల తీరుపై నిశిత పరిశీలన ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో స్వయంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్న జనసేన ఎమ్మెల్యే బాలరాజు నేరుగా ఆయనే క్షేత్రస్థాయిలో సామాన్యుడిలా రంగంలోకి దిగారు. బుట్టాయగూడెం ఎమ్మార్వో ఆఫీసులో సుమారు గంటపాటు ప్రజల మధ్య ఉండి, అధికారుల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలకు రెవెన్యూ సేవలు సకాలంలో అందుతున్నాయా లేదా, సిబ్బందికి టైంకు అందుబాటులో ఉంటున్నారా అని స్వయంగా పరిశీలించారు. పంచె, టీషర్టు ధరించి.. తలపై క్యాప్, ముఖానికి మాస్క్ ధరించి ఎమ్మార్వో  అక్కడికి వచ్చిన ప్రజలను సైతం అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయని ఆరా తీశారు. విషయం తెలిసి అధికారులు షాక్   తాను ఎవరో చెప్పి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధికారులకు షాకిచ్చారు. అనంతరం తన రాకను వెల్లడించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిరంతరం ఆఫీసుల చుట్టూ తిప్పించుకోకుండా ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. బాధితుడైన రిటైర్డ్ టీచర్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని  అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తీసుకున్న ఆకస్మిక తనిఖీ, అది కూడా మారువేషంలో రావడంతో  స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Smart Kitchen Appliances : స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు

Kitchen Appliances : వంటగదిలో మనం రోజూ ఉపయోగించే పరికరాలు.. మన పనిని తగ్గించేలా ఉండాలి. అందుకే కిచెన్​లో ఈ 5 పరికరాలు ఉండేలా చూసుకోండి. ఇవి వంటను త్వరగా, ఈజీగా చేయడంలో హెల్ప్ చేస్తాయి.  Must-Have Kitchen Appliances : కిచెన్ చిన్నగా ఉన్నా.. పెద్దగా ఉన్నా కొన్ని పరికరాలు వంటగదిలో పెట్టుకుంటే వంటను చేసుకోవడం సులభం అవుతుంది. సరైన పరికరాలను ఎంచుకోవడం ద్వారా టైమ్, ఎనర్జీని సేవ్ చేసుకోగలుగుతారు. టీ, బ్రేక్​ఫాస్ట్, కూరగాయలు కట్ చేయడం, చిరుతిళ్లు చేయడం వంటి అనేక పనులను సులభంగా చేసేలా కొన్ని పరికరాలు హెల్ప్ చేస్తాయి. ఇవి ఇంట్లో ఉండేవారికే కాదు.. పీజీలు, హాస్టళ్లు, అద్దె ఇళ్లు, స్టూడియో అపార్ట్‌మెంట్లలో ఉండేవారికి కూడా హెల్ప్ అవుతాయి. కాబట్టి రోజూవారీ వంటల్లో ఉపయోగపడేలా.. తక్కువ స్థలం తీసుకునే పరికరాలు ఏంటో.. అవి వంటకి ఎలా హెల్ప్ అవుతాయో ఇప్పుడు చూసేద్దాం.  ఎగ్ బాయిలర్..  కిచెన్లో ఎగ్ బాయిలర్ ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గుడ్లు ఉడకబెట్టడం, మోమోలు లేదా ఇడ్లీలను స్టీమ్ చేయడం, కూరగాయలు వండటం, పిల్లల ఆహారాన్ని తయారు చేయడం వంటి పనులకు దీనిని ఉపయోగించవచ్చు. చాలావరకు మార్కెట్లలో 3-ఇన్-1 మల్టీ-కుక్కర్ ఎగ్ బాయిలర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవి 900 నుంచి.. 2,200 రేంజ్లో అందుబాటులో ఉంటాయి.  యాక్టివ్ బ్లెండర్.. మీ కిచెన్లో మిక్సర్, స్మూతీ మేకర్, ట్రావెల్ బాటిల్‌ పెట్టేందుకు స్థలం లేకపోతే.. యాక్టివ్ బ్లెండర్ తీసుకోవచ్చు. దీనిని స్మూతీలు, ప్రోటీన్ షేక్‌లు, మ్యాంగో లస్సీ, గ్రీన్ జ్యూస్, చట్నీలు, మసాలా పేస్ట్‌లు, కాఫీ పొడిని తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. యాక్టివ్ బ్లెండర్ రెండు ఫుడ్-గ్రేడ్ జార్‌లు, ప్రత్యేక బ్లేడ్‌లతో వస్తుంది. వీటి ధర 1,995 నుంచి మొదలై.. 2,747 వరకు అందుబాటులో ఉంటాయి. ఎలక్ట్రిక్ చాపర్.. ప్రతిరోజూ ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, కూరగాయలను తరగడం పెద్ద పనిగా ఉంటుంది. కానీ ఎలక్ట్రిక్ చాపర్ ఈ పనిని క్షణాల్లో పూర్తి చేయగలదు. ఎలక్ట్రిక్ వెజిటబుల్ చాపర్లో స్టెయిన్‌లెస్ స్టీల్ బ్లేడ్, ఒక విస్కింగ్ డిస్క్, 0.4 లీటర్ల గిన్నె ఉంటాయి. ఇవి తరగడమే కాకుండా.. చట్నీ బేస్‌లను తయారు చేయడానికి, కూరగాయలను తరగడానికి, గుడ్లు లేదా క్రీమ్‌ను గిలకొట్టడానికి హెల్ప్ చేస్తాయి.  ఎలక్ట్రిక్ కెటిల్  టీ, కాఫీ, నూడుల్స్, ఇన్‌స్టంట్ సూప్ లేదా వేడి నీటి కోసం ఎలక్ట్రిక్ కెటిల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గ్లాస్ కెటిల్‌కు 1.8-లీటర్ల సామర్థ్యం ఉంటుంది. దీనిని ఉపయోగించి మరిగించడం, ఆవిరి మీద ఉడికించడం, వండటం వంటి ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. మినీ ఎయిర్ ఫ్రైయర్ మినీ ఎయిర్ ఫ్రైయర్‌ను ఉపయోగించి సమోసాలు, పకోడీలు, కట్‌లెట్‌లు, పనీర్ టిక్కా, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్, మఖానా వంటి స్నాక్స్‌ను తయారు చేసుకోవచ్చు. ఈ స్నాక్స్‌ను తక్కువ నూనెతో లేదా నూనె లేకుండా తయారు చేసుకోవచ్చు. మినీ ఎయిర్ ఫ్రైయర్‌లో 180 నుంచి 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత సెట్టింగ్, 30 నిమిషాల టైమర్తో హాయిగా కుక్ చేసుకోవచ్చు.  మరిన్ని పరికరాలు.. బ్రెడ్ టోస్ట్ చేయడానికి, శాండ్‌విచ్‌లను వేడి చేయడానికి, తక్కువ పరిమాణంలో కుకీలు లేదా కప్‌కేక్‌లు తయారు చేయడానికి, చీజ్ లేదా చికెన్‌ను గ్రిల్ చేయడానికి ఒక చిన్న టోస్టర్ గ్రిల్లర్ తీసుకోవచ్చు. గ్యాస్ కనెక్షన్ లేకపోయినా లేదా అదనపు బర్నర్ అవసరమైనా, పోర్టబుల్ ఇండక్షన్ కుక్కర్ కూడా ఒక ప్రత్యామ్నాయం. దీనిని అన్నం, పప్పు, కూరగాయలు, తడ్కా వండటానికి మరియు పాలను వేడి చేయడానికి ఉపయోగించవచ్చు. ఇలాంటి ఎలక్ట్రిక్ వస్తువులను కిచెన్లో పెట్టుకుంటే.. వంట వేగంగా, సులభంగా చేసుకోగలుగుతారు.  

Samson Explosive Fifty: అఫ్గాన్‌ను చిత్తు చేసి సిరీస్ కొల్లగొట్టిన భారత్, శ్రేయ‌స్ ఖాతాలో స్వదేశంలో తొలి ట్రోఫీ .. స‌త్తా చాటిన నితీశ్, అభిషేక్, ఇషాన్..

సంజూ శాంసన్ కేవలం 22 బంతుల్లోనే 57 రన్స్ చేసి దంచికొట్టడంతో భారత్ రెండో టీ20లో ఏడు వికెట్లతో అఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసి సిరీస్ గెలిచింది. India Clinch Afghanistan T20 Series Behind Samson Masterclass: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా పూర్తి ఆధిపత్యం కనబరిచింది. అఫ్గానిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. 2019 తర్వాత సొంతగడ్డపై ఇప్పటివరకు ఒక్క ద్వైపాక్షిక టీ20 సిరీస్ కూడా ఓడిపోని రికార్డును భారత్ నిలబెట్టుకుంది. స్వదేశంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత జట్టుకు ఇదే తొలి సిరీస్ విజయం కావడం విశేషం. అంత‌కుముందు టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9  వికెట్ల‌కు 158 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ క‌మ్ కెప్టెన్ ఇబ్ర‌హీం జ‌ద్రాన్ (37) టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో తెలుగు స్టార్ నితీశ్ రెడ్డి, మూడు వికెట్ల‌తో స‌త్తా చాటాడు. అనంత‌రం టార్గెట్ ను కేవ‌లం 14.5 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల‌కు 163 ప‌రుగులు చేసి పూర్తి చేసింది. సంజూ శాంస‌న్ సూప‌ర్బ్ ఫిఫ్టీ (22 బంత‌ల్లో 57, 7 ఫోర్లు, 4 సిక్స‌ర్లు)తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ కు మూడు వికెట్లు ద‌క్కాయి. నితీశ్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది. 20 బంతుల్లోనే సంజూ హాఫ్ సెంచరీ.. విమర్శలకు బ్యాట్‌తో సమాధానంతొలి మ్యాచ్‌లో విఫలమై తీవ్రమైన ఒత్తిడిలో పడ్డ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ..  ఈ మ్యాచ్ చేజింగ్ లో అద్భుతంగా పుంజుకున్నాడు. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడినా, ఆ తర్వాత బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 20 బంతుల్లోనే అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్న సంజూ, మొత్తం 22 బంతుల్లోనే 57 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అవతలి ఎండ్‌లో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 19 బంతుల్లో 39 పరుగులు చేసినప్పటికీ, శాంసన్ ఆడిన ఇన్నింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 88 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి పవర్‌ప్లే ముగిసే సమయానికి స్కోరును 82 పరుగులకు చేర్చారు. 160 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఎంతో సులువుగా ఛేదించి విజయాన్ని నమోదు చేసింది. నితీష్ రెడ్డి కెరీర్ బెస్ట్ బౌలింగ్.. అంత‌కుముందు ఫ‌స్ట్ బ్యాటింగ్ చేపట్టిన అఫ్గానిస్తాన్ భారత బౌలర్ల ధాటికి మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమైంది.  భారత యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ మూడు కీలక వికెట్లు నేలకూల్చాడు. పేస్ గుర్రం అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. దీంతో అఫ్గాన్ బ్యాటర్లు భారీ భాగస్వామ్యాలు నిర్మించలేకపోయారు.   సిరీస్ కైవసం.. నామమాత్రంగా మారిన ఆఖరి పోరుమొదటి మ్యాచ్‌లో 157 పరుగులను 14 ఓవర్ల లోపే ఊదేసిన భారత బ్యాటింగ్ లైనప్, రెండో పోరులోనూ అదే విధ్వంసాన్ని కొనసాగించి విజయాన్ని తేలిక చేసింది. దీంతో మూడో టీ20 నామమాత్రపు మ్యాచ్‌గా మారింది. ఇదే వేదిక‌పై గురువారం మూడో మ్యాచ్ జ‌రుగుతుంది.  

PMFME Scheme: ఫుడ్ బిజినెస్ చేసేవారికి గుడ్ న్యూస్.. రూ. 10 లక్షల రుణంపై 35% సబ్సిడీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

PMFME Scheme: పుడ్ బిజినెస్ చేసేవారికి కేంద్ర ప్రభుత్వం పీఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా 35 శాతం సబ్సిడీతో రూ.10 లక్షల వరకూ రుణాలు అందిస్తుంది. PMFME Scheme: కొత్తగా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? లేదా ఉన్న బిజినెస్‌ను మరింత విస్తరించాలనుకుంటున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే.  MSME పథకం కింద ఫుడ్ బిజినెస్, కేటరింగ్ లేదా ప్రాసెసింగ్ రంగంలో ఉన్నవారికి రూ. 10 లక్షల వరకు సబ్సిడీ లోన్స్ లభిస్తున్నాయి. అంతేకాదు, ఇందులో ఏకంగా 35% వరకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ఈ లోన్ పొందడానికి సరైన బిజినెస్ ప్లాన్, GST, ప్రాజెక్ట్ రిపోర్టు సిద్ధం చేసుకుంటే ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది. పన్నులు తగ్గించుకోవడమే కాకుండా ఆర్థికంగా స్థిరపడటానికి ఇది ఒక గొప్ప అవకాశం.    కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో PMFME పథకం ఫుడ్ బిజినెస్ చేసేవారికి భారీ ఆర్థిక సబ్సిడీ లభిస్తోంది. కొత్తగా ఫుడ్ బిజినెస్ ప్రారంభించేవారితో పాటు, ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోవాలనుకునే వారికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. అర్హతలు & సబ్సిడీ వివరాలు ప్రాజెక్ట్ ఖర్చుపై 35% వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. గరిష్టంగా రూ. 10 లక్షల వరకు క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ ఉంటుంది. దరఖాస్తుదారుడు ప్రాజెక్ట్ విలువలో కేవలం 10% మాత్రమే సొంతంగా పెట్టుబడి పెట్టాలి. మిగిలిన 90% మొత్తాన్ని బ్యాంకులు రుణంగా మంజూరు చేస్తాయి.  అర్హులు  18 ఏళ్లు పైబడిన వ్యక్తులు, కొత్త ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టేవారు, మహిళా స్వయం సహాయక బృందాలు (SHGs), రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOs) ఈ సబ్సిడీకి అర్హులు.  వ్యాపారాలు  బేకరీలు, పికిల్స్ తయారీ, మిల్లెట్స్ అండ్ స్నాక్స్ తయారీ, మసాలా పొడుల తయారీ, డెయిరీ ఉత్పత్తులు, పండ్ల రసాలు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు.  లోన్   మొత్తం ప్రాజెక్ట్ వ్యయం - రూ. 10,000,00 దరఖాస్తుదారు వాటా (10%) - రూ. 1,00,000 బ్యాంకు రుణం (90%) - రూ. 9,00,000 ప్రభుత్వ సబ్సిడీ (35%) - రూ. 3,50,000 కావాల్సిన పత్రాలు  ఆధార్ కార్డు, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కనీసం 8వ తరగతి పాస్ లేదా పదో తరగతి సర్టిఫికెట్  డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్  కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ పాస్‌బుక్, షాపు రెంటల్ అగ్రిమెంట్ అప్లై చేయడం ఎలా?  PMFME పోర్టల్ https://pmfme.mofpi.gov.in/ ఓపెన్ చేయండి. మీ మొబైల్ నంబర్, ఆధార్ వివరాలతో అప్లికెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.మీ పర్సనల్ డీటైల్స్, ఫుడ్ బిజినెస్ రకం, అంచనా ప్రాజెక్ట్ ఖర్చు వివరాలను నమోదు చేయాలి.అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ సమర్పించిన తర్వాత నోడల్ ఏజెన్సీ లేదా జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC) అధికారులు పరిశీలించి, అనుమతి కోసం సంబంధిత బ్యాంకులకు పంపుతారు.

Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!

Tata Sons Chairman Chandrasekaran:భారతీయ కార్పొరేషన్ దిగ్గజం టాటా సన్స్‌ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. నోయల్‌తో విభేదాలు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  Tata Sons Chairman Chandrasekaran Resigns:ఆగస్టు 12, 2026 ఉదయం దేశీయ వ్యాపార రంగంలో ఎవరూ ఊహించని వార్త షేర్ మార్కెట్‌ను షేక్ చేసింది సుమారు 9 ఏళ్లుగా టాటా గ్రూప్‌ను తిరుగులేని రీతిలో నడిపిస్తున్న ఎన్ చంద్రశేఖరన్, టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తన పదవీ కాలం ఫిబ్రవరి 2027 వరకు ఉన్నప్పటికీ గడువు కంటే ముందే ఆయన వైదొలగడం సంచలనంగా మారింది.  ఆగస్టు 18న జరగాల్సిన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశానికి కేవలం కొన్ని రోజుల ముందు ఈ రాజీనామా సమర్పించడం వెనుక తీవ్రమైన అంతర్గత సంక్షోభం దాగి ఉందని స్పష్టమవుతోంది. అయితే గ్రూప్‌ కార్యకలాపాల్లో ఆకస్మిక అస్థిరత రాకుండా ఉండేందుకు, తన ప్రస్తుత టర్మ్‌ ముగిసే వరకు బాధ్యతల్లో సహాయకారిగా ఉంటానని చంద్రశేఖరన్‌ బోర్డుకు తెలిజేశారు.  నోయెల్‌ టాటా కోల్డ్ వార్‌ చంద్రశేఖరన్ నిష్కృమణకు కేవం వ్యక్తిగత కారణాలు మాత్రమే కాకుండా, గ్రూప్‌లోని అత్యున్నత స్థాయి వ్యక్తుల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలే కీలకమని తెలుస్తోంది. ప్రధానంగా టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్ నోయెల్‌ టాటాతో ఆయనకు ఉన్న వ్యూహాత్మక వైరుధ్యాలు ఈ సంక్షోభానికి పునాది వేశాయి.  చంద్రశేఖరన్ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టాటా న్యూ సూపర్ యాప్‌ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ఇ- కామర్స్‌ సెమికండక్టర్‌ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టినప్పటికీ , తక్షణ లాభాలు రాకపోవడంపై నోయెల్ టాటా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం టాటా సన్స్‌ను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయాల్సి ఉండగా, దీనిని నోయెల్ టాటా వర్గం వ్యతిరేకించింది. టాటా సన్స్‌ ఎప్పటికీ ఐపీవోకి తీసుకెళ్లకూడదనే కఠిన షరతుపై సంతకం చేయడానికి చంద్రశేఖర‌న్ నిరాకరించడం విభేదాలను మరింత ముదిరాయి.  టాటా సన్స్‌ బోర్డులో టాటా ట్రస్ట్స్‌కు ఉండాల్సిన ప్రాతినిధ్యం, నిర్వహణ అధికారుల విషయంలో ఛైర్మన్‌ చంద్రశేఖర్, ట్రస్టీల మధ్య గత కొంతకాలంగా సఖ్యత లోపించింది.  ఏజీఎం ఓటింగ్ ముప్పు ఆగస్టు 18న జరగనున్న ఏజీఎంలో చంద్రశేఖరన్‌ డైరెక్టర్‌గా తిరిగి ఎన్నిక కావాల్సి ఉంది. అయితే 66 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉన్న టాటా ట్రస్ట్స్‌ ప్రతినిధులు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉందని సంకేతాలు అందాయి. ఓటింగ్ ద్వారా పదవి నుంచి  తొలగించడం కంటే గౌరవప్రదంగా రాజీనామా చేయడమే మేలని చంద్రశేఖరన్ భావించినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రశేఖర్ 9 ఏళ్లలో సాధించిన విజయాలు 2017లో సైరస్ మిస్త్రీ వివాదం తర్వాత బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖరన్, టాటా గ్రూప్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ఆయన హయాంలో గ్రూప్ మార్కెట్‌ విలువ 400 బిలియన్ల మార్కును దాటింది. దశాబ్దాల తర్వాత ఎయిర్‌ ఇండియాను తిరిగి టాటా గూటికి చేర్చడం ఆయన సాధించిన అతి పెద్ద విజయం. టాటా మోటార్స్‌ను ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌లో లీడర్‌గా నిలపడమే కాకుండా, దేశీయ చిప్‌ తయారీకి పునాదులు వేశారు. ఐటీ రంగంలో టీసీఎస్‌ లాభాలను స్థిరంగా ఉంచుతూ గ్రూప్‌ ఆర్థిక పునాదిని బలోపేతం చేశారు.  మార్కెట్‌ ప్రభావం చంద్రశేఖరన్ రాజీనామా వార్త బయటకు రాగానే టాటా గ్రూప్ షేర్లు కుప్పకూలాయి. టీసీఎస్‌ 2.5 శాతం, టాటా మోటార్స్‌ 3.2 శాతం, టాటా పవర్‌ 2.9శాతం మేర నష్టపోయాయి. ఇన్వెస్టర్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా అమ్మకాల ఒత్తిడి పెరిగింది.  తదుపరి బాధ్యతలు ఎవరికి? ప్రస్తుతం నోయెల్ టాటా పేరు రేసులో ఉన్నప్పటికీ, ఆయన నేరుగా బాధ్యతలు చేపడతారా లేదా మళ్లీ చంద్రశేఖరన్ లాంటి ఒక ప్రొఫెషనల్‌ లీడర్‌ను బయటి నుంచి ఎంపిక చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.     

Sugar Price Hike: మళ్లీ పెరిగిన చక్కెర ధరలు; ప్రస్తుతం ధర ఎంత ఉందంటే?

Sugar Price Hike: రక్షాబంధన్, గణేష్ చతుర్థి పండుగలు సమీపిస్తుండటంతో, చక్కెర ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. మంగళవారం ధరలు మళ్లీ పెరగడంతో, సాధారణ కొనుగోలుదారులలో ఆందోళన నెలకొంది. Sugar Price Hike: పండుగ సీజన్ సమీపిస్తున్న కొద్దీ, చక్కెర ధరలు తగ్గడానికి బదులుగా పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సోమవారం కిలో సగటు ధర 63.05 రూపాయలు ఉండగా, మంగళవారం రిటైల్ చక్కెర ధరలు దాదాపు ఒక రూపాయి పెరిగి కిలోకు సుమారు 64 రూపాయలకు చేరాయి.  ధరలు వేగంగా పెరుగుతున్నాయి వినియోగదారుల వ్యవహారాల శాఖ (ధరల పర్యవేక్షణ విభాగం) డేటా ప్రకారం, ఆగస్టు 25న అఖిల భారత చక్కెర సగటు ధర కిలోకు ₹63.97గా ఉంది. ఇది నెల రోజుల క్రితం కిలోకు ₹48.81గా ఉన్న ధర కంటే 31% అధికం. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ధర 38% ఎక్కువ. ఏడాది క్రితం ఇదే సమయంలో చక్కెర కిలోకు ₹46.31 ధరకు లభించేది.  అందుబాటులో ఉన్న డేటాను ఉటంకిస్తూ, సోమవారం చక్కెర గరిష్ట విక్రయ ధర కిలోకు ₹76 కాగా, 'మోడల్ రేటు' కిలోకు ₹65గా ఉందని పీటీఐ వార్తా సంస్థ నివేదించింది. గత కొన్ని రోజులుగా మిల్లుల వద్ద ధరలు తగ్గాయని ప్రభుత్వం, చక్కెర పరిశ్రమ సంఘాలు తెలిపాయి. అయితే, చిల్లర మార్కెట్‌పై దీని ప్రభావం ఇంకా కనిపించాల్సి ఉంది.  టోకు ధరలు తగ్గుతున్నాయి లెక్కల ప్రకారం, సోమవారం చక్కెర టోకు ధర కిలోకు ₹59.23గా ఉంది. నెల రోజుల క్రితం ఇది కిలో ₹45.35గా, ఏడాది క్రితం కిలో ₹43.01గా ఉండేది. చక్కెర దిగుమతులకు అనుమతినిస్తూ, స్పెక్యులేషన్,  నిల్వలపై ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల తర్వాత, చక్కెర మిల్లు ధర 18% తగ్గి కిలోకు ₹55కి చేరిందని సోమవారం ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. గత వారం, చక్కెర మిల్లు ధర కిలోకు రికార్డు స్థాయిలో ₹67కి చేరుకుంది.  ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది? ప్రజలకు ఉపశమనం కలిగించి, పెరుగుతున్న ధరలను అరికట్టడానికి, చక్కెర దిగుమతులపై సుంకం విధించకపోవడం సహా ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో సరఫరాను పెంచేందుకు, చాలా కాలం తర్వాత 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెరను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వం చక్కెర నిల్వలపై పరిమితులను కూడా విధించింది. చక్కెర డీలర్లకు 400 టన్నుల నిల్వ పరిమితిని నిర్దేశించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి, బేకరీలు, మిఠాయి తయారీదారుల వంటి పెద్ద పారిశ్రామిక వినియోగదారులు 15 రోజుల కంటే ఎక్కువ కాలం నిల్వలను ఉంచుకోవడానికి అనుమతి లేదు.   చక్కెర నిల్వలను, బ్లాక్ మార్కెట్‌ను నివారించేందుకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త బృందాలు మిల్లులను సందర్శించి, చక్కెర నిల్వలను తనిఖీ చేస్తున్నాయి.

Gold Price September 2026: సెప్టెంబర్‌లో బంగారం ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా? కీలక అంచనా!

Gold Price Prediction September 2026: బంగారం 3 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. సెప్టెంబర్‌లో  డాలర్, వడ్డీ రేట్లు, ప్రపంచ ఉద్రిక్తతలు, బులియన్ మార్కెట్, ప్రాపంచిక జ్యోతిష్యం గురించి తెలుసుకోండి. సెప్టెంబర్ 2026 బంగారం ధర అంచనా: బంగారం ధరలు మరోసారి అందర్నీ ఆశ్చర్యపరిచాయి. కేవలం కొన్ని ట్రేడింగ్ సెషన్లలోనే భారీగా పెరిగిన తర్వాత, బంగారం 3 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఇప్పుడు, అతిపెద్ద ప్రశ్న సెప్టెంబర్ గురించే. ఈ పెరుగుదల ధోరణి కొనసాగుతుందా, లేక అధిక ధరల వద్ద లాభాల స్వీకరణ తిరిగి ప్రారంభమవుతుందా? మార్కెట్ పరిస్థితులు , గ్రహ సూచనలు ఈ నెలంతా తీవ్రమైన హెచ్చుతగ్గులతో ఉంటుందని సూచిస్తున్నాయి, కానీ ఏకపక్ష ర్యాలీని కాదు. ప్రస్తుతం బంగారం ఏ స్థాయిలో ఉంది? ఆగస్టు 24న అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ బంగారం ధరలు ఔన్సుకు $4,650కి చేరాయి. మే మధ్యకాలం తర్వాత ఇదే అత్యధిక స్థాయి. ఒక్క గత వారంలోనే బంగారం ధరలు ఐదు శాతానికి పైగా పెరిగాయి. దీని ప్రభావం భారతదేశంలో కూడా స్పష్టంగా కనిపించింది. ఆగస్టు 24న, MCXలో 10 గ్రాముల బంగారం ధర సుమారు ₹163,870కి చేరుకుంది. IBJA ప్రకారం, 999 స్వచ్ఛత గల బంగారం ఉదయం ధర 10 గ్రాములకు ₹162,603గా ఉండగా, సాయంత్రం ధర ₹162,154గా ఉంది. ఇందులో జీఎస్టీ , ఆభరణాల తయారీ ఛార్జీలు కలపలేదు. అయితే, ఆగస్టు 25న అంతర్జాతీయ మార్కెట్ తన గరిష్ట స్థాయిల నుంచి స్వల్పంగా క్షీణించింది. బంగారం సుమారు 0.2 శాతం తగ్గి దాదాపు $4,640కి చేరింది. దీని అర్థం ర్యాలీ బలంగానే ఉన్నప్పటికీ, మార్కెట్ అధిక స్థాయిల వద్ద సంకోచాన్ని ప్రదర్శించడం ప్రారంభించింది. అకస్మాత్తుగా ఎందుకు అంతగా పెరిగింది? ఈ పెరుగుదలకు కేవలం పండుగ డిమాండ్ మాత్రమే కారణం కాదు. ప్రపంచ మార్కెట్లో డాలర్ బలహీనపడటం ఒక ప్రధాన కారణం. డాలర్ పడిపోయినప్పుడు, ఇతర కరెన్సీలలో బంగారం ధర సాపేక్షంగా తగ్గుతుంది. దీనివల్ల దాని డిమాండ్ పెరగవచ్చు. దీర్ఘకాలిక బాండ్ల కొనుగోళ్లను పెంచాలన్న అమెరికా ప్రభుత్వ ప్రణాళిక, డాలర్ , ప్రభుత్వ రుణాలపై కూడా ఆందోళనలను రేకెత్తించింది. అంతేకాకుండా, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, కొత్త ఆంక్షల అవకాశం, సురక్షిత ఆస్తిగా బంగారానికి డిమాండ్‌ను పెంచాయి. మార్కెట్ ఇప్పుడు యూఎస్ ద్రవ్యోల్బణ డేటాను , ఫెడరల్ రిజర్వ్ వైఖరిని నిశితంగా గమనిస్తోంది. ద్రవ్యోల్బణం పెరిగి, వడ్డీ రేట్లను అధికంగా ఉంచే సూచనలు ఉంటే, బంగారం లాభాలు దెబ్బతినవచ్చు. బంగారం క్రమమైన వడ్డీని అందించదు, కాబట్టి పెరుగుతున్న బాండ్ దిగుబడులు తాత్కాలికంగా దాని ఆకర్షణను తగ్గించగలవు. భారతదేశంలోని రూపాయి, డాలర్ మారకపు రేట్లు కూడా ముఖ్యమైనవి. అంతర్జాతీయ బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, రూపాయి బలహీనపడటం దేశీయ ధరలను మరింత పెంచవచ్చు. బులియన్ నిపుణులు దేని కోసం చూస్తున్నారు? మీడియా , మార్కెట్ నివేదికల ప్రకారం, సెంట్రల్ బ్యాంక్ డిమాండ్, అమెరికా రుణాల గురించిన ఆందోళనలు, బలహీనమైన డాలర్  భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారానికి మద్దతు ఇవ్వగలవు. ధర $4,700 దాటితే, అది తదుపరి పెరుగుదలకు మార్గాన్ని తెరుస్తుందని వారు భావిస్తున్నారు. మరోవైపు, టీడీ సెక్యూరిటీస్ మరింత జాగ్రత్తగా ఉంది. వారి ప్రకారం, బంగారం ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఒక రక్షణగా ఉన్నప్పటికీ, పెరుగుతున్న వడ్డీ రేట్లు దాని పెరుగుదలను నిలిపివేయగలవు. చాలా అధిక లక్ష్యానికి వేగంగా పెరుగుతుందని ఆశించడం తొందరపాటు అవుతుందని ఆ సంస్థ భావిస్తోంది. దీని అర్థం ఏంటంటే, ర్యాలీకి ఆస్కారం ఉందని నిపుణులు భావిస్తున్నప్పటికీ, ప్రస్తుత గరిష్ట స్థాయి నుంచి భారీ పతనం కంటే, మొదట లాభాల స్వీకరణ జరిగి, ఆ తర్వాత కొత్త దిశ ఏర్పడే అవకాశమే ఎక్కువగా ఉంది. మేదిని జ్యోతిష్యం ఏమి సూచిస్తుంది? లౌకిక జ్యోతిష్యశాస్త్రంలో బంగారం ప్రధానంగా సూర్యుడు , బృహస్పతితో ముడిపడి ఉంటుంది. శుక్రుడు మార్కెట్ డిమాండ్, విలాసం   ఆభరణాల వ్యాపారాన్ని సూచిస్తాడు. బుధుడు వ్యాపారం , రోజువారీ మారుతున్న భావోద్వేగాలతో సంబంధం కలిగి ఉంటాడు. భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ జాతకంలో వృషభ రాశి లగ్నంగా ఉంది. సంపద  మార్కెట్ విలువకు ప్రాతినిధ్యం వహించే రెండవ ఇంటికి బుధుడు అధిపతి. అందువల్ల, బంగారానికి సూచిక అయిన గురుడు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. 2026 ఆగస్టు 15వ తేదీ జాతకంలో లగ్నంగా సింహరాశి ఉంది. లగ్నానికి అధిపతి సూర్యుడు, వార్షిక జాతకంలో గురుడు కర్కాటక రాశిలో ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. ఇది భవిష్యత్తులో విలువైన లోహాల ధరలకు బలమైన మద్దతును సూచిస్తుంది. అయితే, సంపదకు నిలయమైన కన్యారాశిలో ఉన్న శుక్రుడు  ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 9 వరకు కొనసాగే రాహువు ముద్రా దశ, ఈ పరిస్థితిని అస్థిరంగా మారుస్తున్నాయి. రాహువు ఆకస్మిక మార్కెట్ హెచ్చుతగ్గులు, పుకార్లు, భయం, వేగవంతమైన లాభాల స్వీకరణతో ముడిపడి ఉంటుంది. అందువల్ల, సెప్టెంబర్‌లో బంగారం ధర సరళరేఖలో పెరిగే అవకాశం లేదు.  ఆగష్టు 28న జరిగిన చంద్రగ్రహణం తరువాత, సెప్టెంబర్ ప్రారంభంలో మార్కెట్ కార్యకలాపాలు అసాధారణంగా ఉండవచ్చు. మొదటి వారంలో గరిష్ట స్థాయిల నుంచి తగ్గుదల లేదా ధరలో ఆకస్మిక మార్పు సంభవించవచ్చు. నెల మధ్య నాటికి, సూర్యుని బలమైన ప్రభావం బంగారం పెరుగుదలకు మరింత కారణమైంది. సెప్టెంబర్ 17వ తేదీన సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించిన తర్వాత, మార్కెట్ దృష్టి డేటా, డాలర్ ,వడ్డీ రేట్లపైకి వేగంగా మళ్లవచ్చు. సెప్టెంబర్  పూర్తి సంకేతం   సెప్టెంబర్‌లో బంగారం ధరలలో వచ్చిన గణనీయమైన పెరుగుదల ఇంకా పూర్తిగా ముగిసినట్లు కనిపించడం లేదు. అయితే, ఆగస్టులో కనిపించినటువంటి భారీ పెరుగుదల పునరావృతం కావడం కష్టంగా ఉండవచ్చు. నెల ప్రారంభంలో , చివరిలో లాభాల స్వీకరణ ఒత్తిడి పెరగవచ్చు, అయితే మధ్యలో మళ్లీ ధరలు పుంజుకోవచ్చు. మొత్తంమ్మీద.. సెప్టెంబర్ నెల సూచిస్తున్నదేంటంటే..పెరిగిన ధరలు కొనసాగవచ్చు, కానీ ఈ క్రమంలో తీవ్రమైన తగ్గుదలలు, పునరుద్ధరణలు రెండూ ఉంటాయి. వాస్తవ దిశను అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడ్ వైఖరి, డాలర్, బాండ్ దిగుబడులు, భౌగోళిక రాజకీయ సంఘటనలు , రూపాయి కదలికలు నిర్ణయిస్తాయి.

Piles Types and Grades : పైల్స్ ఎన్ని రకాలు ఉంటాయి? వాటిలో ఏది ప్రమాదకరం? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

Types of Hemorrhoids : పైల్స్ సమస్యతో చాలామంది ఇబ్బంది పడతారు. అయితే దీనిలో రకాలు ఏంటో.. మొలలు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం. Hemorrhoids Warning Signs : పైల్స్ లేదా మొలలు (హెమరాయిడ్స్-Hemorrhoids) అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్య. మలబద్ధకం, మలవిసర్జన సమయంలో ఎక్కువగా ఇబ్బంది,  టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చోవడం, ఆహారంలో ఫైబర్ తక్కువగా తీసుకోవడం వంటి కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే పైల్స్​లో కొన్నిరకాలు ఉంటాయి. పైగా వాటి లక్షణాలు కూడా ఒకేలా ఉండవని చెప్తున్నారు నిపుణులు.  మొలలు కొన్ని సందర్భాల్లో నొప్పి, దురద వంటి లక్షణాలు మాత్రమే కలిగి ఉంటే.. మరికొన్ని సందర్భాల్లో మలంతో పాటు రక్తం కనిపించవచ్చు. అయితే మొలల్లో ఏ రకం ఎక్కువ ప్రమాదకరం? ఏ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. మొలలు రెండు రకాలు ఉంటాయి. వాటిలో ఒకటి హెమరాయిడ్స్‌. వీటిని సాధారణంగా అంతర్గత మొలలు (Internal Hemorrhoids) అంటారు. రెండు బాహ్య మొలలు (External Hemorrhoids). అంతర్గత మొలలు  మలద్వారం లోపల, పురీషనాళం దిగువ భాగంలో ఉన్న రక్తనాళాలు వాపునకు గురైనప్పుడు అంతర్గత మొలలు ఏర్పడతాయి. ఇవి ప్రారంభ దశలో తీవ్రమైన నొప్పిని కలిగించవు. కానీ మలవిసర్జన సమయంలో ఎర్రటి రక్తం కనిపించడం దీనిలో ప్రధాన లక్షణంగా ఉంటుంది. అయితే ఈ  అంతర్గత మొలలను అవి ఎంతవరకు బయటకు వస్తున్నాయనే దానిపై నాలుగు గ్రేడ్‌లుగా విభజిస్తారు. గ్రేడ్ 1 : మొలలు లోపలే ఉంటాయి. బయటకు కనిపించవు. గ్రేడ్ 2 : మలవిసర్జన సమయంలో బయటకు వచ్చినా.. తర్వాత వాటంతట అవే లోపలికి వెళ్లిపోతాయి. గ్రేడ్ 3 : బయటకు వచ్చిన మొలలను చేతితో మళ్లీ లోపలికి నెట్టాల్సి ఉంటుంది. గ్రేడ్ 4 : మొలలు బయటకు వచ్చి ఉంటాయి. వాటిని చేతితో కూడా లోపలికి నెట్టడం సాధ్యం కాకపోవచ్చు. బాహ్య మొలలు  మలద్వారం చుట్టూ.. చర్మం కింద ఉన్న రక్తనాళాలు వాపునకు గురైనప్పుడు బాహ్య మొలలు ఏర్పడతాయి. వీటిలో నొప్పి, వాపు, దురద, మంట వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొన్నిసార్లు బాహ్య మొలలోని రక్తనాళంలో రక్తం గడ్డకట్టవచ్చు. దీనిని థ్రాంబోస్డ్ హెమరాయిడ్ అంటారు. ఇలా జరిగినప్పుడు మలద్వారం దగ్గర గడ్డలా అనిపించడంతో పాటు అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి రావచ్చు.అయితే థ్రాంబోస్డ్ హెమరాయిడ్ సాధారణంగా ప్రాణాంతక పరిస్థితి కాదు. కానీ తీవ్రమైన నొప్పి, వాపు లేదా గడ్డ అకస్మాత్తుగా ఏర్పడితే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఏ రకం మొలలు ప్రాణాంతకం? సాధారణంగా వచ్చే అంతర్గత లేదా బాహ్య మొలలను ప్రాణాంతకమైనవిగా చెప్పలేం. కాబట్టి ఫస్ట్ గ్రేడ్ కంటే ఫోర్త్ గ్రేడ్ ప్రాణాంతకం అని చెప్పడం సరైనది కాదు. గ్రేడ్ పెరిగే కొద్దీ సమస్య తీవ్రత పెరగవచ్చు. చికిత్స అవసరం కావచ్చు. కానీ అవి స్వయంగా క్యాన్సర్‌గా మారడం లేదా ప్రాణాంతకంగా మారడం జరగదు. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త..  కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు కచ్చితంగా వైద్య సహాయం తీసుకోవాలని అంటున్నారు నిపుణులు. ఆగకుండా లేదా ఎక్కువగా మలద్వారం నుంచి రక్తస్రావం కావడం, తల తిరగడం, నీరసం లేదా బలహీనంగా అనిపించడం జరగవచ్చు. స్పృహ కోల్పోయేలా అనిపించడం, తీవ్రమైన లేదా అకస్మాత్తుగా నొప్పి పెరగడం, మలం నల్లగా లేదా తారులా కనిపిస్తే అలెర్ట్ అవ్వాలి.  మలంలో రక్తం కనిపించడం, మలవిసర్జన అలవాట్లలో మార్పులు, మలబద్ధకం, నొప్పి లేదా దురద రోజులు గడిచినా తగ్గకపోతే కచ్చితంగా వైద్య సహాయం తీసుకోవాలి. తీవ్రమైన లేదా నిరంతర రక్తస్రావం కొనసాగితే రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల రక్తస్రావాన్ని తేలికగా తీసుకోవద్దు.  మొలలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొలలను నివారించాలంటే మలబద్ధకాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. కాబట్టి రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు వంటి పీచు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. తగినంత నీరు తాగాలి. మలవిసర్జన వచ్చినప్పుడు ఎక్కువసేపు ఆపుకోకూడదు. టాయిలెట్‌లో అవసరానికి మించి ఎక్కువసేపు కూర్చోకూడదు. మలవిసర్జన సమయంలో గట్టిగా ముక్కకూడదు. శారీరకంగా చురుకుగా ఉండటం వల్ల కూడా మలబద్ధకం నివారణకు సహాయపడుతుంది.     గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Pensions | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువును మరో 2 రోజులు పొడిగించింది. అర్హులందరికీ అవకాశం ఇవ్వడానికే ఈ నిర్ణయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. NTR Bharosa Pensions | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువును పెంచుతూ శుభవార్త అందించింది. అర్హులైనవారు ఈ నెల 18వ తేదీ వరకు పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా పింఛను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే మరో రెండు రోజులు సమయం పెంచినట్లు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. అంతకుముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు ఉన్న పింఛన్లకు దరఖాస్తు గడువును ఇప్పుడు సెప్టెంబర్ 18 వరకు విస్తరించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులందరూ వెంటనే దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. స్థానిక స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల వద్ద దరఖాస్తుల స్వీకరణతో పాటు ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయడానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు నమోదు ప్రక్రియ పూర్తయిన వెంటనే అభ్యర్థులకు రసీదు (అకనాలెడ్జ్‌మెంట్) పత్రాన్ని అందజేస్తారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా సుమారు 62 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయని మంత్రి తెలిపారు. అయితే ఏదైనా కేటగిరీలో అర్హత ఉండి ఇప్పటివరకు నమోదు చేసుకోని వారు ఈ పెంచిన గడువును సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా స్కీమ్ కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, మత్స్యకారులు సహా ఇతర అర్హులైన చేతివృత్తుల వారు దీనికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.  ప్రధాన అర్హతలు ఆదాయం: గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ. 10,000, పట్టణాల్లో రూ. 12,000 మించరాదు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే భూమి ఉండాలి. ఇతర నిబంధనలు: కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లు లేదా ఇన్‌కమ్ టాక్స్ చెల్లింపుదారులు ఉండరాదు. దరఖాస్తులు, పరిశీలన విధానం అభ్యర్థులు స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు కార్యాలయంలో అప్లికేషన్ ఫారం సమర్పించాలి. వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి సిబ్బంది eKYC పూర్తి చేస్తారు. ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ ద్వారా అర్హతలను పరిశీలించిన తర్వాత, సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి డాక్యుమెంట్లు వెరిఫై చేస్తారు. ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ ఈ జాబితాను పరిశీలించి ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తారు. క్షేత్రస్థాయి అధికారుల సిఫార్సుల ఆధారంగా రాష్ట్రస్థాయిలో పరిశీలన జరిపి, బడ్జెట్ కేటాయింపును బట్టి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్లకు ఆమోదం తెలుపుతుంది.

మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?

PM Modi-Xi Meeting 2026: ఢిల్లీలో కుదిరిన ఒప్పందం తర్వాత సరిహద్దులో చైనా ఏం చేస్తుంది? చర్చలు, వాణిజ్యం, ఒత్తిడికి సంబంధించిన సంకేతాల కోసం అక్టోబర్ 2న ప్రారంభమయ్యే చైనీస్ నూతన సంవత్సర జాతకం చూద్దాం.. China Kundli 2026: షీ జిన్‌పింగ్ ...ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో  భారతదేశాన్ని ఒక భాగస్వామిగా అభివర్ణించారు కానీ ప్రత్యర్థిగా కాదు. సరిహద్దులో శాంతి, వివాదానికి ఆమోదయోగ్యమైన పరిష్కారం గురించి కూడా చర్చించారు. వాణిజ్యాన్ని పెంచడం, ప్రత్యక్ష విమాన సర్వీసులు, వీసాలు, వ్యాపార మార్పిడులు వంటి అంశాలపై చర్చలు జరిగాయి. కానీ చైనాను అర్థం చేసుకున్నవారు కేవలం ప్రకటనలపై ఆధారపడరు. అసలు కథ దాని తదుపరి చర్యలలోనే ఉంది. చైనా అక్టోబర్ 1వ తేదీన తన జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. కొన్ని గంటల తర్వాత, అక్టోబర్ 2వ తేదీ ఉదయం, దాని కొత్త తాజిక్ సంవత్సర జాతకం అమలులోకి వస్తుంది. దీనర్థం, ఢిల్లీ సమావేశంలో కుదిరిన ఏకాభిప్రాయానికి తొలి పరీక్ష అక్టోబర్‌లో ప్రారంభమవుతుంది.  షీ జిన్‌పింగ్ మాటలకు అనుగుణంగా చైనా సరిహద్దు విషయంలో అదే స్థాయిలో ఉదారతను ప్రదర్శిస్తుందా, లేక చర్చల ముసుగులో తన పాత ఒత్తిడి విధానాన్ని కొనసాగిస్తుందా? ప్రధాని మోదీ-షి జిన్‌పింగ్ సమావేశంలో ఏం నిర్ణయించారు? సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, షీ జిన్‌పింగ్ సమావేశమయ్యారు. భారత్, చైనా ప్రత్యర్థులుగా కాకుండా అభివృద్ధి భాగస్వాములుగా ముందుకు సాగాలని ఇద్దరు నాయకులు అంగీకరించారు. ప్రభుత్వం ప్రకారం, సరిహద్దు వివాదానికి న్యాయమైన, సహేతుకమైన , ఆమోదయోగ్యమైన పరిష్కారం దిశగా కృషి చేయడానికి ఒక ఒప్పందం కుదిరింది. ద్వైపాక్షిక సంబంధాలకు సరిహద్దు వెంబడి శాంతిని కాపాడుకోవడం కూడా అత్యవసరమని నిర్ణయించారు. వాణిజ్య అసమతుల్యతలు, మార్కెట్ ప్రాప్యత, రవాణా అనుసంధానాలు , ప్రజల మధ్య రాకపోకలపై తదుపరి చర్చలు జరిగాయి. కానీ కొత్త ఉపసంహరణ ప్రణాళిక, దళాల ఉపసంహరణ తేదీ లేదా తుది సరిహద్దు ఒప్పందం ఏదీ వెలువడలేదు. ఈ అనిశ్చితి కథను అక్టోబరు వరకు తీసుకువచ్చింది. చైనా జాతీయ దినోత్సవం 1వ తేదీన, జాతకం ప్రకారం సంవత్సరపు అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుందా? చైనా జాతీయ దినోత్సవం అక్టోబర్ 1న వస్తుంది. అయితే, అందుబాటులో ఉన్న జ్యోతిష్య గణనల ప్రకారం, 2026వ సంవత్సరం అక్టోబర్ 2న, బీజింగ్ స్థానిక కాలమానం ప్రకారం సుమారు ఉదయం 9:00 గంటలకు ప్రారంభమవుతుంది. వార్షిక జాతకం క్యాలెండర్ తేదీపై ఆధారపడి ఉండదు. అది సూర్యుడు జన్మస్థానంలో తిరిగి కనిపించే క్షణంపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, జాతీయ దినోత్సవం , నూతన సంవత్సర ప్రవేశ తేదీ భిన్నంగా ఉండవచ్చు. ఈ సంవత్సరం ప్రవేశంతో ఏర్పడిన జాతకంలో లగ్నం తులారాశి. లగ్నంలో శుక్రుడు తన సొంత రాశిలో ఉన్నాడు. ఇక్కడ బుధుడు కూడా ఉన్నాడు. అక్టోబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 23వ తేదీ వరకు బుధుని ముద్రా దశ అమలులో ఉంటుంది. పైపైన చూస్తే, ఇది యుద్ధానికి సంబంధించిన జాతకంలా కాకుండా, సంప్రదింపులకు సంబంధించిన జాతకంలా కనిపిస్తుంది. చైనా అకస్మాత్తుగా ఎందుకు బలహీనంగా కనిపించవచ్చు? తులారాశి సమతుల్యత, రాజీ , భాగస్వామ్యానికి ప్రతీక. దీని అధిపతి అయిన శుక్రుడు తన సొంత రాశిలో బలంగా ఉన్నాడు. బుధుడు సందేశాలు, పత్రాలు, వాణిజ్యం , దౌత్య మార్గాలకు అధిపతి. మొదటి సూచన స్పష్టంగా ఉంది. అక్టోబర్‌లో భారత్‌తో చర్చలను విరమించుకోవడానికి చైనా ఇష్టపడదు. సైనిక అధికారులు, ప్రత్యేక ప్రతినిధులు లేదా దౌత్య కార్యవర్గాల స్థాయిలో సంప్రదింపులు ముందుకు సాగవచ్చు. ప్రత్యక్ష విమానాలు, వీసాలు, వ్యాపార చలనశీలత , మార్కెట్ ప్రవేశం వంటి అంశాలపై కూడా పరిమిత పురోగతి కనిపించవచ్చు. కానీ ఇక్కడ ఒక చిక్కు ఉంది. చైనా జాతకంలో, బుధ గ్రహం యొక్క షడ్కోణ బలం సాపేక్షంగా బలహీనంగా ఉండగా, శని , గురు గ్రహాల బలాలు బలంగా ఉన్నాయి. దీనివల్ల చర్చలు, ప్రకటనలు వేగంగా జరిగినా, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి అవసరమైన వ్యూహాత్మక ఏర్పాట్లు మాత్రం నెమ్మదిగా కొనసాగవచ్చు.  సులభంగా చెప్పాలంటే, బీజింగ్ మాట్లాడటానికి తొందరపడి, వెనక్కి తగ్గడానికి నెమ్మదిగా ఉండవచ్చు. అంగారక గ్రహం ఏం చెబుతోంది? నూతన సంవత్సర జాతకంలో, విదేశాలు , బహిరంగ సంఘర్షణకు సంబంధించిన ఏడవ ఇంటికి కుజుడు అధిపతి. కర్కాటక రాశిలో నీచ స్థితిలో ఉన్న కుజుడు దశమ స్థానంలో ఉన్నాడు. ఉచ్ఛస్థితిలో ఉన్న గురుడు దానితో పాటు ఉన్నాడు. కుజుడు కర్కాటక రాశిలో ఉన్నంత మాత్రాన అతన్ని నిష్క్రియగా పరిగణించడం తప్పు. భూమి , భూభాగంతో సంబంధం ఉన్న చతురస్ర కోణమైన చైనా   D4లో కుజుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు,  శని తన సొంత రాశిలో ఉన్నాడు. ఇది చైనా  ప్రాదేశిక స్థానాన్ని బలపరుస్తుంది. అందువల్ల, కొత్త జాతకంలో బలహీనపడిన కుజుడు సైన్యాన్ని బలహీనపరచడానికి బదులుగా, దూకుడు ధోరణిని మార్చగలడు. ప్రత్యక్ష ఘర్షణను నివారించాలి సరిహద్దు రహదారులు, నిఘా, సైనిక మౌలిక సదుపాయాలు , గస్తీ సామర్థ్యాలను తగ్గించకూడదు. చర్చలు కొనసాగాలి, కానీ చైనా తన మునుపటి వాదనల నుంచి వెంటనే వెనక్కి తగ్గదు. ప్రస్తుతానికి ఇది జరిగే అవకాశం కనిపించడం లేదు. కుజుడితో పాటు బృహస్పతి  ఉచ్చస్థితి, పరిస్థితి అదుపు తప్పకుండా నిరోధించగలదు. అందువల్ల, అక్టోబర్ ఒక పెద్ద యుద్ధం కంటే, నియంత్రిత ఒత్తిడి ఉండే సమయంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. తెర వెనుక ఇంకేమైనా జరుగుతోందా? వార్షిక జాతకంలో చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ, అష్టమ భావంలో ఉన్నాడు. అష్టమ భావం అనేది వెంటనే బహిరంగపరచని నిర్ణయాలతో ముడిపడి ఉంటుంది. ఇది ఆకస్మిక మార్పులు, రహస్య చర్చలు , తెరవెనుక వ్యూహాలను కూడా సూచిస్తుంది. దీనిని ఉపయోగించి ద్రోహాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేము. అయితే, చైనా బహిరంగ ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో దాని అమలుకు మధ్య వ్యత్యాసం ఉండవచ్చు. ఇది సరిహద్దు పరిష్కారం గురించి మాట్లాడుతూనే ఉంది, కానీ తుది పటాన్ని గానీ, ప్రాదేశిక రాజీని గానీ విస్మరిస్తోంది. ఇది వాణిజ్యాన్ని పెంచుతామని వాగ్దానం చేస్తూనే, కీలక ఖనిజాలు, పారిశ్రామిక పరికరాలు లేదా సాంకేతికతపై తన నియంత్రణను కొనసాగిస్తోంది. ఈ విషయంలో భారతదేశం మాటల కన్నా చేతల వైపు చూడాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య పరిష్కారమవుతుందా లేక నిలిచిపోతుందా? కొత్త సంవత్సర జాతకంలో పూర్తి ఇక్బాల్ యోగం లేదు. ఇందువర్ యోగం కూడా లేదు. లగ్నాధిపతి అయిన శుక్రుడు తన సొంత రాశిలో బలంగా ఉన్నందున, చైనా తన దౌత్య లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి అనుకూలమైన స్థితిలో ఉంది. అయితే, సరిహద్దు వ్యవహారాల అధిపతి అయిన కుజుడు అనుకూలమైన స్థితిలో లేడు. సూర్యుడు, శని మధ్య ఉన్న ఉద్రిక్తత కూడా ప్రకటించిన విధానం, క్షేత్రస్థాయిలో ఉన్న అడ్డంకులు ఒకే వేగంతో ముందుకు సాగవని సూచిస్తోంది. కంబూల్ ఒప్పందం స్పష్టంగా, ఏకగ్రీవంగా ధృవీకరించబడలేదు. దీని అర్థం పరిస్థితులు పూర్తిగా తారుమారవుతాయని కాదు. ప్రధాని మోదీ, షీ జిన్‌పింగ్‌ల మధ్య జరిగే సమావేశం నుంచి నేరుగా కాకుండా, ఆ తర్వాత క్రియాశీలమయ్యే యంత్రాంగాల నుంచి ఈ నిర్ణయం వెలువడుతుందనే సూచన ఉంది. ఈ కథలో తదుపరి ముఖ్య పాత్రధారులు సైనిక కమాండర్లు, సరిహద్దు నిపుణులు లేదా ప్రత్యేక ప్రతినిధులు కావచ్చు. అక్టోబర్‌లోని నాలుగు ముఖ్యమైన కాలాలు అక్టోబర్‌లో చైనాలో బుధ గ్రహ దశ ఒకేలా ఉండదు. గణన పద్ధతిని బట్టి, తేదీలు కొన్ని గంటల వరకు మారవచ్చు. అక్టోబర్ 2-9  సంభాషణలకు , నూతన దౌత్య సందేశాలకు సమయం. చైనా నుంచి సానుకూల ప్రకటనలు లేదా సంప్రదింపుల కార్యక్రమాలు వెలువడే అవకాశం ఉంది. అక్టోబర్ 9 -12 కేతువు సూక్ష్మ ప్రభావం గందరగోళాన్ని పెంచవచ్చు. సమాచారం, సమావేశాలు లేదా ప్రతిపాదనలు అసంపూర్తిగా మిగిలిపోవచ్చు. అక్టోబర్ 12 -20 శుక్ర గ్రహ ప్రభావం సాపేక్షంగా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారం, వీసాలు, విమానాలు లేదా ప్రజల రాకపోకలకు సంబంధించిన పురోగతికి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. అక్టోబర్ 20-28 దేశీయ రాజకీయాలు, ప్రతిష్టకు సంబంధించిన ఒత్తిళ్లు పెరగవచ్చు. రెండు దేశాలు తమ ప్రయోజనాలను మరింత బలంగా నొక్కిచెబుతాయి. అక్టోబర్ 28-31 అంగారకుడి సూక్ష్మ ప్రభావం జాగ్రత్త వహించమని సూచిస్తోంది. సరిహద్దు సంబంధిత వాక్చాతుర్యం, సైనిక కార్యకలాపాలు లేదా గస్తీ ఘర్షణలకు సంబంధించిన వార్తలు రావచ్చు.  అక్టోబర్ 9న భారతదేశ వ్యూహం కూడా మారనుంది భారతదేశ వార్షిక జాతకంలో, రాహువు ముద్రా దశ అక్టోబర్ 9వ తేదీ వరకు కొనసాగుతుంది. రాహువు ఏడవ ఇంట్లో ఉన్నాడు. దీనివల్ల విదేశీ సంబంధాలలో కార్యకలాపాలు పెరుగుతాయి, కానీ నమ్మకంపై అనిశ్చితి నెలకొని ఉంటుంది. గురు గ్రహ ముద్రా దశ అక్టోబర్ 9వ తేదీన ప్రారంభమవుతుంది. భారతదేశ వార్షిక జాతకంలో గురు గ్రహం ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ, అది పన్నెండవ ఇంట్లో ఉంది. ఇది బహిరంగ ప్రదర్శన కంటే తెరవెనుక దౌత్యం, వ్యూహాత్మక సన్నాహాలు , రహస్య చర్చలను సూచిస్తుంది. భారత జాతీయ జాతకంలోని సర్వాష్టవర్గంలో, ఏడవ ఇంటికి సాపేక్షంగా తక్కువ పాయింట్లు ఉండగా, పదకొండవ ఇంటికి బలమైన పాయింట్లు ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే, చైనాతో భాగస్వామ్యం అంత సులభం కాదు, కానీ కష్టతరమైన చర్చల నుంచి కొన్ని ఆచరణాత్మక ప్రయోజనాలను పొందవచ్చు. భారతదేశపు డి4లో భూమి, భద్రతకు సంబంధించిన గ్రహాలు బలంగా ఉన్నాయి. అందువల్ల, కేవలం సానుకూల ప్రకటనల ఆధారంగా సరిహద్దు సమస్యపై ప్రధాని మోదీ ప్రభుత్వం త్వరగా రాజీకి వచ్చే అవకాశం లేదు. అక్టోబర్‌లో చైనా నుంచి మనం ఏం ఆశించవచ్చు? సరిహద్దు సమస్యపై తుది పరిష్కారం లభించేలోపు, వాణిజ్యం, వీసా, విమానాలు లేదా వ్యాపార రాకపోకలకు సంబంధించిన చిన్నపాటి చర్యలు తీసుకోవచ్చు. చైనా సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ సరిహద్దులోని తన వ్యూహాత్మక స్థానాన్ని అంత సులభంగా వదులుకోదు. ఒక పెద్ద దాడి జరిగినట్లు స్పష్టమైన, నిశ్చయాత్మకమైన ఆధారాలు లేనప్పటికీ, సైనిక సన్నాహాలు, సైనిక సమీకరణ, విన్యాసాలు లేదా పరిమిత గస్తీ ఘర్షణల వల్ల కలిగే ప్రమాదం గురించి ప్రస్తావించలేదు. అక్టోబర్ 2వ తేదీన చైనా వార్షిక జాతకం మారనుంది. కానీ దాని ఉద్దేశాలను కేవలం గ్రహాలు మాత్రమే నిర్ధారించవు. అక్టోబర్‌లో తీసుకునే చర్యలే అసలైన సమాధానాన్ని అందిస్తాయి. సరిహద్దు చర్చలు పురోగమించి, క్షేత్రస్థాయిలో ఒత్తిడి తగ్గుముఖం పడితే, ఢిల్లీలో కుదిరిన ఒప్పందం నిజంగా మార్గాన్ని తెరిచినట్లే. మాటలు మృదువుగా ఉండి, సైనిక మోహరింపులు, నిర్మాణ పనులు యథాతథంగా కొనసాగితే, మొదటి నెలలోనే చైనా కొత్త జాతకంలోని కఠోర సంకేతాలు బయటపడతాయి.

Surya Tej: రచయితగా మారిన సూర్య తేజ్... 'నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి' తర్వాత నితిన్ గడ్కరీపై!?

Surya Tej Meets Nitin Gadkari: నటుడిగా, హీరోగా మెప్పించిన సూర్య తేజ్, కొత్త అవతారం ఎత్తారు. రచయితగా మారి 'నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి' రాశారు. త్వరలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై బుక్ రాయనున్నారు. నటుడిగా, కథానాయకుడిగా చిత్రసీమలో ప్రవేశించి మెగాఫోన్ పట్టి డైరెక్షన్ చేసిన ఆరిస్టులు మన తెలుగు చిత్రసీమలో ఉన్నారు. సినిమాలకు కథలు అందించిన వాళ్ళు కూడా ఉన్నారు. దర్శకులుగా వచ్చి హీరోలుగా, నటులుగా మారిన టెక్నీషియన్లు కూడా ఉన్నారు. బట్, ఫర్ ఏ ఛేంజ్... పుస్తక రచయితగా మారారు నటుడు సూర్య తేజ్ (Surya Tej). ఆయన ఓ బుక్ రాశారు. త్వరలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari)పై బుక్ రాయనున్నారు. 'శంభో శివ శంభో' నుంచి 'అప్పుడిలా' వరకు!మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన 'శంభో శివ శంభో'లో సూర్య తేజ్ చేసిన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత 'వినాయకుడు'లో సెకండ్ హీరో రోల్ చేశారు. అందులోని నటనకూ మంచి పేరు వచ్చింది. అక్కడ నుంచి 'అప్పుడిలా ఇప్పుడిలా' సినిమాలో హీరోగా నటించారు. ఇప్పుడు ఆయన రచయితగా మారారు. రచయితగా కొత్త ప్రయాణం గురించి సూర్య తేజ్ మాట్లాడుతూ... ''ఈ ప్రయాణం ప్రారంభించడం నా జీవితంలో ఓ మైలురాయిగా భావిస్తున్నాను. 'శంభో శివ శంభో' రీ రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది'' అని చెప్పారు. రచయితగా తన తొలి పుస్తకం 'నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి' గురించి సూర్య తేజ్ మాట్లాడుతూ... ''నాగపూర్ సిటీలో ఎంతో పవిత్రమైన 'తేక్డి గణపతి' వైభవాన్ని, చరిత్రను పుస్తక రూపంలో తీసుకు వచ్చిన మొదటి రచయితగా నిలవడం నా అదృష్టం. ఇప్పటి వరకు తెక్డి గణపతిపై బుక్ రాలేదు. ప్రపంచంలో ఇదే మొదటిది. సంప్రదాయ కథనానికి భిన్నంగా రాసిన పుస్తకమిది. ఇది డివోషనల్ బుక్ కాదు... జీవితాన్ని ప్రాక్టికల్‌గా చూపించే పుస్తకమిది. గణపతి అంటే జ్ఞానం. ఓర్పు, జ్ఞానంతో సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో చెప్పే మార్గదర్శి ఇది'' అని చెప్పారు. సుచిర్ ఇండియా గ్రూప్ చైర్మన్ డాక్టర్ లయన్ కిరణ్ చేతుల మీదుగా ఈ పుష్కరాన్ని ఆవిష్కరించారు. నితిన్ గడ్కరీపై త్వరలో బుక్ రానుందా?కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సూర్య తేజ్ సన్నిహితంగా మెలుగుతున్నారు. ప్రస్తుతం ఆయన ప్రవేశపెట్టిన విధానాలను ప్రచారం చేస్తున్నారు. భవిష్యత్తులో రైతులు, గ్రామీణ యువత ఆర్థికంగా ఉన్నత స్థాయికి రావడానికి ఉపయోగపడే భారతీయ విధానాలపై మరిన్ని పుస్తకాలను తీసుకురాబోతున్నానని సూర్య తేజ్ చెప్పారు. సినిమాల విషయానికి వస్తే... సూర్య తేజ్ హీరోగా నటించిన 'అప్పుడలా ఇప్పుడిలా' అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీలో 'పర్ఫెక్ట్ బిజినెస్ మాన్'గా ఆ సినిమా డబ్బింగ్ అయ్యింది. యూట్యూబ్‌లో పదకొండు మిలియన్ వ్యూస్ వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వంతో అనుసంధానమైన స్కిల్ డెవలప్‌మెంట్, ఉన్నత విద్యా రంగంతో కలిసి సూర్య తేజ్ పని చేస్తున్నారు. శాక న్యోరా సొల్యూషన్స్ సంస్థకు కో ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.

Power House: క్యాటరింగ్ బిజినెస్ మ్యాన్ కాదు... ఆ ఒక్కటీ సీక్రెట్ - విక్రమ్ 'పవర్ హౌస్' గ్లింప్స్ చూశారా?

చియాన్ విక్రమ్ హీరోగా రూపొందుతున్న 63వ చిత్రానికి 'పవర్ హౌస్' టైటిల్ ఖరారు చేశారు. క్యాటరింగ్ బిజినెస్ మ్యాన్ నుంచి రౌడీలను కుమ్మే పవర్ ఫుల్ పర్సన్ వరకు... విక్రమ్ ట్రాన్స్‌ఫర్మేషన్ బావుంది. తమిళ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాదు... విలక్షణ నటనతో తెలుగులోనూ  ఫ్యాన్స్ సొంతం చేసుకున్న హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram). ఆయన సినిమా అంటే సంథింగ్ స్పెషల్ స్టోరీ ఉంటుందని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. లేటెస్ట్ సినిమా టైటిల్ గ్లింప్స్ చూస్తే... మరోసారి అది అర్థం అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. చియాన్ విక్రమ్ హీరోగా రూపొందుతున్న ఆయన 63వ సినిమాకు 'పవర్ హౌస్' (Power House) టైటిల్‌ ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ తాజాగా విడుదల చేశారు. అది చూస్తే... క్యాటరింగ్ బిజినెస్ మ్యాన్ కాదు... అది సీక్రెట్!విక్రమ్‌తో 'ఇరు ముగన్' వంటి హిట్ తీసిన ఆనంద్ శంకర్, ఈ 'పవర్ హౌస్'కు దర్శకుడు. సత్య జ్యోతి ఫిల్మ్స్ నిర్మిస్తోంది. టైటిల్ గ్లింప్స్ చూస్తే... సుమారు మూడున్నర నిమిషాలు ఉంది.పవర్ హౌస్' టైటిల్ గ్లింప్స్‌లో పెళ్లిళ్ల క్యాటరింగ్ బిజినెస్ మ్యాన్‌గా విక్రమ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన కుమార్తె పాత్రలో 'సర్వం మాయ'తో పాపులరైన రియా షిబు కనిపించారు. విజువల్స్ మొదలైన కాసేపటి వరకు బిజినెస్ వ్యవహారాలు, అందులో ఫ్యామిలీ సీన్స్ చూపించారు. అయితే స్టోరేజ్ యూనిట్ వైపు విక్రమ్ వెళ్లిన తర్వాత అసలు ట్విస్ట్ బయట పడింది. అక్కడ ఇద్దర్ని కొట్టేసి కట్టేసినట్టు అర్థం అవుతోంది. వాళ్ళ బాడీ నుంచి వచ్చిన బ్లడ్ క్లీన్ చేసే పనిలో విక్రమ్ పడతారు. అసలు ఆ ఇద్దరూ ఎవరు? వాళ్ళను ఎందుకు కట్టేశారు? క్యాటరింగ్ బిజినెస్ కాకుండా విక్రమ్ ఇంకేం చేస్తారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.సీనియర్ నటి ఊర్వశి, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది (2027లో) థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడు. ఇది కాకుండా దర్శకుడు విష్ణు ఎడవన్‌తో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, అలాగే '96' ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు విక్రమ్.

Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే

YSRCP Politics | శ్రీకాకుళం జిల్లా వైసీపీలో తీవ్ర అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఒక్క సీటు కూడా రాదని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి నాగ్ (Chiranjeevi Nag) చేసిన వ్యాఖ్యలు వైసీపీలో తీవ్ర కలకలం రేపాయి. వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదని, కావాలంటే పార్టీ సర్వే నివేదికలను పరిశీలించుకోవచ్చని సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో పార్టీ సీనియర్ నాయకుల తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ వైఖరితో పార్టీకి ఏ ప్రయోజనం లేదన్నారు. జిల్లా నాయకత్వంపై తీవ్ర విమర్శలు ఆమదాలవలసలోని తమ నివాసంలో మీడియాతో మాట్లాడిన చిరంజీవి నాగ్.. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్ వైఖరి సరిగ్గా లేదని విమర్శించారు. పార్టీకి పెద్దదిక్కుగా చెప్పుకొనే ధర్మాన ప్రసాదరావు తీవ్ర అభద్రతాభావంతో రాజకీయాలు చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జిల్లా పరిశీలకుడు బూడి ముత్యాలనాయుడి బాధ్యతలపై ప్రశ్నిస్తూ, స్థానిక ఎన్నికల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను వేదికపై ఉన్న సీనియర్ నాయకులు ఎవరూ ఖండించకపోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.  తమ కుటుంబంపై వ్యాఖ్యల్ని ఖండించలేదని మండిపాటు సెప్టెంబర్ 12న త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ సర్వసభ్య సమావేశం నిర్వహించింది.  చింతాడ రవి అరెస్టును రాజకీయ పరిణామంగా అభివర్ణించి, తమ్మినేని సీతారాం అరెస్టు కాకపోవడానికి బంధుత్వాలే కారణమని గొర్లె కిరణ్ మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. జిల్లా పరిశీలకుడు బూడి ముత్యాలనాయుడు, పార్లమెంట్ పార్టీ పరిశీలకులు అయిన కుంబ రవి, సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావులు గొర్లె కిరణ్ కుమార్ వ్యాఖ్యల్ని ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.   పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించడంలో ధర్మాన కృష్ణదాస్ విఫలమయ్యారని, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలను అడ్డుకోలేకపోయారని విమర్శించారు. కేవలం ఒక కులాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేయాలనుకుంటే ఆ విషయాన్ని నేరుగా పార్టీ అధిష్ఠానానికి స్పష్టం చేయాలని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాల్లో వైసీపీ ఒక్క సీటూ గెలవదని తమ్మినేని కుమారుడు చిరంజీవి నాగ్ చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.

Telangana Assembly Clash: అసెంబ్లీ ఘర్షణల రగడ - కాంగ్రెస్‌ది అతి రాజకీయమా? KTR పీఏ, పీఆర్వోల విచారణతో తిరగబడ్డ వ్యూహం!

BRS vs Congress 2026: తెలంగాణ అసెంబ్లీ ఘర్షణల కేసులో కేటీఆర్ పీఏ, పీఆర్వోలపై సైఫాబాద్ పిఎస్ విచారణ వివాదం అయింది. కాంగ్రెస్ ప్రభుత్వ సెల్ఫ్ గోల్ తో బీఆర్ఎస్ కౌంటర్ ఎటాక్‌ చేస్తున్నట్లు అయింది. Telangana politics self goal:   తెలంగాణ శాసనసభ వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు జరిపిన నిరసన, ఆ తదనంతరం జరిగిన ఘర్షణల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మలుపులు తిరుగుతోంది. చట్టసభల ప్రాంగణంలో ఆందోళనను తీవ్రంగా పరిగణించి, ప్రతిపక్షంపై రాజకీయ మైలేజ్ సాధించాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగింది. బీఆర్ఎస్ అగ్రనేతలపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేయడం, చివరికి మాజీ మంత్రి కేటీఆర్ పిఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్‌లను సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ పేరుతో గంటల తరబడి హాజరుపరచడం వరకు వ్యవహారాన్ని తీసుకెళ్లారు. అయితే, ఈ పరిణామాలను విశ్లేషిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతటి రాజకీయ ప్రయోజనాన్ని ఆశించిందో, అంతకంటే ఎక్కువ రాజకీయ ప్రతికూలతలను ఎదుర్కొనే ప్రమాదంలో పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేటీఆర్ వ్యక్తిగత సిబ్బంది విచారణతో సమస్యలు     ప్రజాప్రతినిధులపై నమోదు చేసిన తీవ్రమైన కేసులు, అలాగే విచారణ ప్రక్రియ శృతిమించడం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది. బీఆర్ఎస్ నేతలను చట్టబద్ధంగా కట్టడి చేయాలనే ఉద్దేశం  వ్యూహాత్మకమే అయినప్పటికీ, కక్షసాధింపు చర్యల స్థాయికి వ్యవహారాన్ని తీసుకెళ్లారనే భావన ప్రజల్లోకి వెళ్తోంది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్ సిబ్బందిని విచారిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు ప్రవేశించి గొడవ పడటానికి యత్నించారనే వార్తలు కలకలం రేపాయి.  పోలీస్ స్టేషన్ లోపలే కస్టడీలో ఉన్నవారిపై దాడికి ప్రయత్నించడం విచారకరం, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి  అని కేటీఆర్ విమర్శించడంతో బీఆర్ఎస్ దీన్ని బలమైన పొలిటికల్ డిఫెన్స్ అస్త్రంగా మార్చుకోగలిగింది. అనవసరపు విచారణలు ఇబ్బందికరంగా మారాయా? విచారణాధికారులు , శాంతిభద్రతల యంత్రాంగం వైఫల్యం అని బీఆర్ఎస్ ప్రతిదాడి చేస్తోంటే, పోలీసు శాఖ మాత్రం దాడి ఆరోపణలను ఖండించి సీసీటీవీ ఆధారాలను తెరపైకి తెచ్చింది. అయినప్పటికీ, ప్రభుత్వం తమను వేధిస్తోందని చూపించే అవకాశం బీఆర్ఎస్‌కు దొరికింది. కేవలం ఒక నిరసన ఘర్షణను  రాజకీయంగా వినాశకరమైన నేరం గా చిత్రీకరించబోయి, బీఆర్ఎస్ స్థానిక శ్రేణులకు సరికొత్త కసిని, సానుభూతిని కాంగ్రెస్ నాయకత్వమే అందించినట్లయింది. ప్రతిపక్షాన్ని ఇరకాటంలో పెట్టాలనుకున్న ప్రభుత్వం, తానే సెల్ఫ్ గోల్ వేసుకుని ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది.  రాజకీయాల్లో అతిగా స్పందించడం ఉద్రిక్తతలను మరింత పెంచుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులో సిట్ విచారణలు, సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ వంటి విజువల్స్ ద్వారా మీడియాలో మైలేజ్ సాధించవచ్చని భావించినా, అది కాస్తా వికటించి ప్రజాప్రతినిధుల సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్నారనే అభిప్రాయానికి దారితీసింది.  కాంగ్రెస్ సీన్ మార్చుకోవాల్సిందే !   శాంతిభద్రతల నిర్వహణలో తమ బలాన్ని నిరూపించుకోవాల్సిన ప్రభుత్వం, ప్రతిపక్షాలకు మైలేజ్ ఇచ్చేలా ప్రవర్తించడం వ్యూహాత్మక లోపంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఘటనను ఆసరాగా చేసుకుని ప్రతిపక్షం నోళ్లు మూయించాలనే కాంగ్రెస్ ప్రయత్నం, బీఆర్ఎస్‌కు తమ క్యాడర్‌ను తిరిగి సమీకరించుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఈ ఓవర్ యాక్షన్ మూలంగా రాజకీయ లాభం కంటే కాంగ్రెస్ పార్టీ నష్టపోయే ప్రమాదమే ఎక్కువగా కనిపిస్తోంది. తక్షణమే ఈ వ్యవహారాన్ని సమర్థవంతంగా సద్దుమణిగేలా చేయకపోతే, రాబోయే రోజుల్లో ప్రతిపక్షాల సానుభూతి వేవ్‌కు కాంగ్రెస్ సమాధానం చెప్పుకోవాల్సి రావచ్చు. 

Alla Nani Passes Away: ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని మృతి పట్ల ఏపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం: ఏలూరు జిల్లా రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని (57) కన్నుమూశారు. విశాఖలోని ఆయన నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు.  గుండెపోటుకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మృతిచెందారని డాక్టర్లు ధృవీకరించారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలు అందించారు. ఆయన మరణవార్తతో ఏలూరు జిల్లాతో పాటు ఏపీ రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. 2024 ఎన్నికల తరువాత కొంతకాలానికి ఆళ్ల నాని వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి, తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆళ్ల నానికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరూ అమెరికాలో ఉంటున్నారు. కాంగ్రెస్ నుంచి టీడీపీ దాకా రాజకీయ ప్రస్థానం30 డిసెంబర్ 1969 లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించిన ఆయన చదువు మధ్యలోనే ఆపివేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఆళ్ల నాని రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతో ప్రారంభమైంది. 1994, 1999 ఎన్నికల్లో ఏలూరు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తొలుత కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన, ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా వైఎస్సార్‌సీపీలో చేరారు. వైసీపీ ప్రభుత్వంలో అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తించారు. డిప్యూటీ సీఎంగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలు అందించారు. కరోనా సమయంలో చాలా యాక్టివ్ గా పనిచేశారు. ఏలూరు నియోజకవర్గంపై బలమైన పట్టున్న నేతగా ఆయన గుర్తింపు పొందారు. ఏలూరు నుంచి 3 సార్లు విజయం ఆళ్ల నాని (ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌) ఏలూరు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2017లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. మారిన రాజకీయ పరిణామాలతో వైసీపీలో చేరిన ఆళ్ల నాని 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు నుంచి మరోసారి గెలుపొందారు. అప్పటి సీఎం వైఎస్ జగన్‌ ఆయనకు వైద్య ఆరోగ్యశాఖ శాఖతో పాటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగించారు. కరోనా సమయంలో అందుబాటులో ఉంటూ అధికారులను పరుగులు పెట్టించారు.   2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.ఆళ్ల నాని మీద టీడీపీకి చెందిన బడేటి రాధాకృష్ణయ్య (చంటి) విజయం సాధించారు. ఆ ఎన్నికల తరువాత రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేశారు. ఫిబ్రవరి 2025లో టీడీపీలో చేరారని తెలిసిందే.