Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Dharavath Nikhil Death Case: ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు

    1 hour ago

    నాలుగేళ్ల కిందట జరిగిన ధరావత్ నిఖిల్ పరువు హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పిచ్చింది. యువతి కుటుంబసభ్యులు నిఖిల్ ను హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు.

    Honor Killing Case | హైదరాబాద్: దాదాపు నాలుగేళ్ల క్రితం జరిగిన ధరావత్ నిఖిల్ అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ పరువు హత్య కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపించేందుకు తెలంగాణ హైకోర్టు సిబిఐ (CBI) విచారణకు ఆదేశించింది. లా డిగ్రీ పూర్తి చేసి, గ్రూప్స్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిఖిల్.. బర్త్‌డే పార్టీకి వెళ్లగా, ఈ క్రమంలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

    యువతి కుటుంబసభ్యులే హత్య చేశారు: నిఖిల్ తల్లిదండ్రుల ఆరోపణలు
    బాధితుడు నిఖిల్ తల్లిదండ్రుల తెలిపిన వివరాల ప్రకారం.. నిఖిల్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ కారణంగా ఆ యువతి తల్లిదండ్రులే పక్కా ప్రణాళికతో నిఖిల్‌ను కిడ్నాప్ చేసి, ఉరివేసి దారుణంగా హత్య చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన రోజున ఇంట్లోనే ఉన్న నిఖిల్‌ను బర్త్‌డే పార్టీ ఉందంటూ కొందరు వచ్చి బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత నిఖిల్ కనిపించకుండా పోవడంతో చిలుకూరు పోలీస్ స్టేషన్‌లో తాము కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిఖిల్ కనిపించకుండా పోయిన 3 రోజుల తర్వాత, చిలుకూరు సమీపంలోని ఒక కాలువలో అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 

    న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు
    ఈ కేసు తీవ్రతను బట్టి గతంలోనే ప్రభుత్వం దీనిపై సిఐడి (CID) విచారణకు ఆదేశించింది. అయితే, అటు స్థానిక పోలీసుల దర్యాప్తులోనూ, ఇటు సిఐడి విచారణలోనూ తమకు ఎలాంటి న్యాయం జరగలేదని నిఖిల్ తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుమారుడి మరణానికి కారణమైన అసలైన నిందితులను కాపాడుతున్నారని నిఖిల్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ న్యాయం కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం, స్థానిక పోలీసులు, సీఐడీ దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. నిఖిల్ మృతి వెనుక ఉన్న అసలు నిజాలను వెలికి తీసేందుకు ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ సోమవారం నాడు (జూన్ 29న) సంచలన తీర్పునిచ్చింది.

    2022 అక్టోబర్‌లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాలువలో సూర్యాపేటకు చెందిన 22 ఏళ్ల లా పట్టభద్రుడు ధరావత్ నిఖిల్ మృతదేహం లభించింది. అయితే అగ్రకులానికి చెందిన యువతితో ఇంటర్మీడియట్ నుంచి ఉన్న స్నేహం ప్రేమగా మారింది. అయితే వీరి కులాలు వేరు కావడంతో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది.  నిఖిల్ గిరిజనుడు కావడంతో అమ్మాయి కుటుంబం, బంధువులు తమ కుమారుడ్ని పరువు హత్య చేశారని బాధితుడి తల్లిదండ్రులు ఆరోపించారు. 

    Click here to Read More
    Previous Article
    Morning Phone Habit : నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు
    Next Article
    Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment