Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం: ఎవరెవరికి ఇస్తారు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

    1 month ago

    NTR Bharosa Pension Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడం కోసం, ఆర్థికంగా అండగా నిలవడం కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, ట్రాన్స్‌జెండర్లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆర్థిక సాయం అందిస్తోంది. ఎన్టీఆర్ భరోసా కింద అందిస్తున్న వివిధ పింఛన్లకు అర్హతలు ఏంటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎవరికి ఎంత పెన్షన్ ఇస్తున్నారు? ఫిర్యాదులు ఉంటే ఎలా చేయాలి? తదితర పూర్తి వివరాలు..

     

    అంశాలు

    • ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అంటే ఏమిటి?
    • ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి అర్హతలు ఏంటి?
    • ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
    • ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)

    రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ గౌరవప్రదమైన జీవితాన్ని అందించే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, గీత కార్మికులు, నేత కార్మికులు తదితర సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థికంగా భద్రత కల్పిస్తోంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం (NTR Bharosa Pension Scheme) కింద ఆయా వర్గాల వారికి నెలకు రూ. 4000 నుంచి రూ. 15,000 వరకు ఆర్థిక సాయం అందిస్తున్నారు.

    ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అంటే ఏమిటి?

    పేద వర్గాల్లో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కూలీలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు నెల నెలా పింఛన్ రూపంలో ఆర్థిక సాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 4 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు స్వయంగా పాల్గొంటున్నారు. ఒకవేళ 1వ తేదీ ఏదైనా పబ్లిక్ హాలీడే ఉంటే.. అంతకంటే ముందే (ముందు నెల 30 లేదా 31) పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తున్నారు.

    ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కింద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నారు. పింఛన్ రకాన్ని బట్టి ప్రస్తుతం రూ. 4000 నుంచి రూ. 15000 వరకు లబ్ధిదారుల ఇంటికే వెళ్లి వాలంటీర్స్ వారికి పెన్షన్ అందిస్తున్నారు.

    ఎన్టీఆర్ భరోసా పథకం లక్ష్యాలు:

    ★ వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, డయాలసిస్ పేషంట్లు మరియు ఇతర సామాజికంగా వెనుకబడిన వర్గాలకు భద్రతా కల్పన.
    ★ వారిని ఆర్థికంగా స్వావలంబులుగా చేయడం.
    ★ నిర్లక్ష్యానికి గురికాకుండా గౌరవభరితమైన జీవితాన్ని అందించేందుకు కృషి చేయడం.

    ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగంగా అందిస్తున్న 14 రకాల పెన్షన్లు:

    ✧ వృద్ధాప్య పింఛన్ - నెలకి రూ. 4000
    ✧ వితంతువు పింఛన్ - నెలకి రూ. 4000
    ✧ ఒంటరి మహిళ పింఛన్ - నెలకి రూ. 4000
    ✧ వికలాంగుల పింఛన్ - నెలకి రూ. 6000 లేదా రూ. 15000
    ✧ కల్లు/గీత కార్మికుల పింఛన్ - నెలకి రూ. 4000
    ✧ నేత కార్మికులు పింఛన్ - నెలకి రూ. 4000
    ✧ మత్స్యకారుల పింఛన్ - నెలకి రూ. 4000
    ✧ యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ART) పింఛన్ - నెలకి రూ. 4000
    ✧ సాంప్రదాయ చర్మకారుల పింఛన్ - నెలకి రూ. 4000
    ✧ ట్రాన్స్‌జెండర్ పింఛన్ - నెలకి రూ. 4000
    ✧ డప్పు కళాకారుల పింఛన్ - నెలకి రూ. 4000
    ✧ సీకేడీయూ పింఛన్ (C.K.D.U. Pension) - నెలకి రూ. 10,000
    ✧ సైనిక్ సంక్షేమ పింఛన్లు - నెలకి రూ. 5000
    ✧ అమరావతి భూమిలేని పేదల పింఛన్ - నెలకి రూ. 5000
    ✧ అభయహస్తం పింఛన్ - నెలకి రూ. 500

    దరఖాస్తు ఫారం:

    ఎన్టీఆర్ భరోసా అప్లికేషన్ ఫామ్‌లను ఈ కింది లింక్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి..

    NTR Bharosa Pension Scheme Application form

    NTR Bharosa Pension application form

    ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి అర్హతలు ఏంటి?

    ★ కుటుంబంలో పెన్షనర్‌ గానీ, ప్రభుత్వ ఉద్యోగి గానీ ఉండకూడదు.
    ★ కుటుంబంలో ఆదాయ పన్ను (ట్యాక్స్) చెల్లించే సభ్యులు ఉండకూడదు.
    ★ ఒక కుటుంబంలో ఒక్క వ్యక్తే పెన్షన్‌‌కు అర్హులు. అయితే, కుటుంబంలో 80 శాతం అంగవైకల్యం ఉన్న దివ్యాంగులు, డయాలసిస్‌ పేషంట్లు, మానసికంగా తీవ్రంగా బాధపడుతోన్న వారు ఉంటే, వారికి కూడా పింఛన్‌ లభిస్తుంది.
    ★ కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి నెలకు రూ. 10,000 లోపు, పట్టణ ప్రాంతాల వారికి రూ. 12,000 లోపు ఉండాలి.
    ★ కుటుంబానికి 3 ఎకరాల లోపు తరి, లేదా 10 ఎకరాల లోపు మెట్ట, లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి. అంతకంటే ఎక్కువ భూమి ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కారు.
    ★ కుటుంబానికి నాలుగు చక్రాల వాహనాలు (టాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు మినహాయించి) ఉండకూడదు.
    ★ కుటుంబం కరెంటు వినియోగం ప్రతి నెలా 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి.

    1. వృద్ధాప్య పింఛన్ (Old Age Pension) ఫథకం

    ★ 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు (పురుషులు, మహిళలు) కలిగి ఉండాలి. జీవనాధారానికి వేరే మార్గం లేకుండా, కుటుంబం లేదా బంధువులపై ఆధారపడకుండా జీవించే వృద్ధులు ఈ పింఛన్‌కు అర్హులు.
    ★ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారైతే వయస్సు 50 ఏళ్లు అంతకంటే ఎక్కువ ఉండాలి.
    ★ వీటితో పాటు పైన పేర్కొన్న అర్హతలు (ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి అర్హతలు ఏంటి?) కలిగి ఉండాలి.

    వృద్ధాప్య పింఛన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన పత్రాలు:

    ✦ ఆధార్ కార్డు
    ✦ రేషన్ కార్డు
    ✦ కుల ధృవీకరణ పత్రం
    ✦ ఆదాయ ధృవీకరణ పత్రం
    ✦ ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్

    2. వితంతువు పింఛన్ (Widow Pension) పథకం

    ★ భర్త చనిపోయిన మహిళలు ఈ పింఛన్‌కు అర్హులు. వివాహ చట్టం ప్రకారం వయస్సు 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉండాలి.
    ★ వీటితో పాటు పైన పేర్కొన్న అర్హతలు (ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి అర్హతలు ఏంటి?) అన్నీ కలిగి ఉండాలి.

    వితంతువు పింఛన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన పత్రాలు:

    ✦ ఆధార్ కార్డు
    ✦ రేషన్ కార్డు
    ✦ కుల ధృవీకరణ పత్రం
    ✦ ఆదాయ ధృవీకరణ పత్రం
    ✦ ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్
    ✦ భర్త మరణ ధృవీకరణ పత్రం

    3. కల్లు/ గీత కార్మికుల పింఛన్ (Toddy Tappers Pension)

    ★ వయస్సు 50 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉన్న కల్లు గీత కార్మికులు ఈ పింఛన్‌కు అర్హులు.
    ★ ఎక్సైజ్ శాఖ ధ్రువీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి.
    ★ వీటితో పాటు పైన పేర్కొన్న అర్హతలు (ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి అర్హతలు ఏంటి?) అన్నీ కలిగి ఉండాలి.

    గీత కార్మికుల పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు:

    ✦ ఆధార్ కార్డు
    ✦ రేషన్ కార్డు
    ✦ కుల ధృవీకరణ పత్రం
    ✦ ఆదాయ ధృవీకరణ పత్రం
    ✦ గీత కార్మికులు అని ఎక్సైజ్ శాఖ ధృవీకరించిన పత్రం

    4. నేత కార్మికుల పింఛన్ (Weavers Pension)

    ★ 50 సంవత్సరాల అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన నేత కార్మికులు ఈ పింఛన్‌కు అర్హులు.
    ★ వీటితో పాటు పైన పేర్కొన్న అర్హతలు (ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి అర్హతలు ఏంటి?) అన్నీ కలిగి ఉండాలి.

    నేత కార్మికుల పింఛన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన పత్రాలు:

    ✦ ఆధార్ కార్డు
    ✦ రేషన్ కార్డు
    ✦ కుల ధృవీకరణ పత్రం
    ✦ ఆదాయ ధృవీకరణ పత్రం
    ✦ ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్
    ✦ నేత కార్మికుల ధృవీకరణ పత్రం

    5. ఒంటరి మహిళ పింఛన్ (Single Women Pension)

    ★ వివాహమై విడిపోయిన ఒంటరి మహిళలు, వివాహం కాకుండా ఒంటరిగా ఉన్న మహిళలు ఈ పింఛన్‌కు అర్హులు.
    ★ వివాహమైన వాళ్లు వయస్సు 35 ఏళ్లు అంతకంటే ఎక్కువ ఉండాలి మరియు పింఛన్ మంజూరు చేసే నాటికి విడిపోయి ఏడాదికి పైగా అయి ఉండాలి.
    ★ ఇక వివాహం కాని మహిళలు.. గ్రామీణ ప్రాంతంలో 30 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు, పట్టణ ప్రాంతంలో 35 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి.
    ★ వీటితో పాటు పైన పేర్కొన్న అర్హతలు (ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి అర్హతలు ఏంటి?) కలిగి ఉండాలి.

    ఒంటరి మహిళ పింఛన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన పత్రాలు:

    ✦ ఆధార్ కార్డు
    ✦ రేషన్ కార్డు
    ✦ కుల ధృవీకరణ పత్రం
    ✦ ఆదాయ ధృవీకరణ పత్రం
    ✦ ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్
    ✦ ఒంటరి మహిళ ధృవీకరణ పత్రం (తహసీల్దార్ కార్యాలయం నుంచి జారీ చేస్తారు)

    6. మత్స్యకారుల పింఛన్ (Fishermen Pension)

    ★ 50 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మత్స్యకారులు/ జాలరి ఈ పింఛన్‌కు అర్హులు.
    ★ వీటితో పాటు పైన పేర్కొన్న అర్హతలు (ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి అర్హతలు ఏంటి?) కలిగి ఉండాలి.

    మత్స్యకార పింఛన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన పత్రాలు:

    ✦ ఆధార్ కార్డు
    ✦ రేషన్ కార్డు
    ✦ కుల ధృవీకరణ పత్రం
    ✦ ఆదాయ ధృవీకరణ పత్రం
    ✦ ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్
    ✦ మత్స్య శాఖ నుంచి ధృవీకరణ పత్రం

    7. అభయహస్తం పింఛన్ (Abhayahastam Pension)

    ★ 60 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసున్న మహిళలు, మరియు SHG సభ్యులైన వారు ఈ పథకానికి అర్హులు. రోజుకు 1 రూపాయి లేదా సంవత్సరానికి రూ. 360 చొప్పున ప్రభుత్వం సహకారం అందిస్తుంది.
    ★ ఈ పింఛన్ కోసం వెలుగు ఆఫీస్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

    8. సంప్రదాయ చర్మకారుల పింఛన్ (Traditional Cobblers Pension)

    ★ 40 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి.
    ★ వీటితో పాటు పైన పేర్కొన్న అర్హతలు (ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి అర్హతలు ఏంటి?) కలిగి ఉండాలి.

    చర్మకారుల పింఛన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన పత్రాలు:

    ✦ ఆధార్ కార్డు
    ✦ రేషన్ కార్డు
    ✦ కుల ధృవీకరణ పత్రం
    ✦ ఆదాయ ధృవీకరణ పత్రం
    ✦ ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్
    ✦ సంక్షేమ శాఖ ద్వారా జారీ చేసిన సంప్రదాయ చర్మకారుల ధృవీకరణ పత్రం

    9. వికలాంగుల పింఛన్ (Disabled Persons Pension)

    ★ పూర్తిగా వికలాంగులైన వారు, పక్షవాతానికి గురై చక్రాల కుర్చీ లేదా మంచానికి పరిమితమైన వారు, తీవ్రమైన కండరాల బలహీనత ఎదుర్కొంటున్న వారు, ప్రమాద బాధితులు ఈ పింఛన్ ద్వారా రూ. 15000 వరకు లబ్ధి పొందవచ్చు.
    ★ వైకల్యం 40 శాతం అంతకంటే ఎక్కువ ఉన్న వారు మాత్రమే ఈ పింఛన్‌కు అర్హులు.
    ★ వయసుతో సంబంధం లేకుండా ఎలాంటి వారైనా ఈ పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు (వయో పరిమితి లేదు).
    ★ వీటితో పాటు పైన పేర్కొన్న అర్హతలు (ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి అర్హతలు ఏంటి?) కలిగి ఉండాలి.

    వికలాంగుల పింఛన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన పత్రాలు:

    ✦ ఆధార్ కార్డు
    ✦ రేషన్ కార్డు
    ✦ కుల ధృవీకరణ పత్రం
    ✦ ఆదాయ ధృవీకరణ పత్రం
    ✦ ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్
    ✦ సదరం ధృవీకరణ పత్రం

    10. ట్రాన్స్‌జెండర్ పింఛన్ (Transgender Pension)

    18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి.
    ★ వైద్య శాఖ నుంచి సర్టిఫికెట్‌ కలిగి ఉన్న ట్రాన్స్‌జెండర్లు ఈ పింఛన్‌కు అర్హులు.
    ★ వీటితో పాటు పైన పేర్కొన్న అర్హతలు (ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి అర్హతలు ఏంటి?) కలిగి ఉండాలి.

    ట్రాన్స్‌జెండర్ పింఛన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన పత్రాలు:

    ✦ ఆధార్ కార్డు
    ✦ రేషన్ కార్డు
    ✦ కుల ధృవీకరణ పత్రం
    ✦ ఆదాయ ధృవీకరణ పత్రం
    ✦ ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్
    ✦ వైద్య శాఖ ద్వారా ట్రాన్స్‌జెండర్ ధృవీకరణ పత్రం

    11. డప్పు కళాకారుల పింఛన్ (Dappu Artists Pension)

    ★ 50 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న డప్పు కళాకారులు ఈ పింఛన్‌కు అర్హులు.
    ★ వీటితో పాటు పైన పేర్కొన్న అర్హతలు (ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి అర్హతలు ఏంటి?) కలిగి ఉండాలి.

    డప్పు కళాకారుల పింఛన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన పత్రాలు:

    ✦ ఆధార్ కార్డు
    ✦ రేషన్ కార్డు
    ✦ కుల ధృవీకరణ పత్రం
    ✦ ఆదాయ ధృవీకరణ పత్రం
    ✦ ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్
    ✦ సంక్షేమ శాఖ ద్వారా డప్పు కళాకారుల ధృవీకరణ పత్రం

    12. సీకేడీయూ పింఛన్ (C.K.D.U. Pension)

    ★ కిడ్నీ, కాలేయం సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులు, గుండె మార్పిడి, CKDU పేషంట్లు, ఎలిఫాంటియాసిస్-గ్రేడ్ 4 పేషంట్లు దీని ద్వారా రూ.10,000 పింఛన్‌కు అర్హులు.

    Click here to Read More
    Previous Article
    NTPC NGEL Engineer Recruitment 2025 : నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) 182 ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే..
    Next Article
    ఉచితంగా LPG కనెక్షన్, రూ.550కే గ్యాస్ సిలిండర్.. ఉజ్వల పథకం వివరాలు

    Related ప్రభుత్వ పథకాలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment