Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Mission Vatsalya: నెలకు రూ.4 వేలు ఇచ్చే ప్రభుత్వ పథకం.. 'మిషన్ వాత్సల్య' స్కీమ్ దరఖాస్తు విధానం ఇలా!

    2 hours ago

    Mission Vatsalya: అనాథ పిల్లల రక్షణ, భద్రత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్ వాత్సల్య పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ పథకం కింద ఏపీ ప్రభుత్వం నెలకు రూ.4 వేలు అందిస్తుంది.

    Mission Vatsalya: మిషన్ వాత్సల్య (Mission Vatsalya) అనేది భారతదేశంలోని పిల్లల రక్షణ, సంక్షేమం, భద్రత కోసం కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో నిర్వహిస్తోన్న ఒక ప్రతిష్టాత్మకమైన పథకం. గతంలోని 'చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్' పథకానికి మార్పుచేర్పులు చేసి 2021-22 నుంచి దీనిని "మిషన్ వాత్సల్య"గా మార్చారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా మిషన్ వాత్సల్య పథకం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా, రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తుంది.  

    ఆంధ్రప్రదేశ్‌లో పథకం అమలు విధానం

    రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ఒక జిల్లా బాలల రక్షణ విభాగం (District Child Protection Unit) ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీనికి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తూ పథకం పర్యవేక్షిస్తుంటారు.  

    1. ఆర్థిక సహాయం  

    ఏపీ ప్రభుత్వం ఈ పథకం కింద అర్హులైన పిల్లల చదువు నిరంతరాయంగా సాగడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. గతంలో ఈ సహాయం తక్కువగా ఉండేది, కానీ మిషన్ వాత్సల్య మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం అర్హులైన ప్రతి బిడ్డకు నెలకు రూ. 4,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ డబ్బు నేరుగా లబ్ధిదారులైన పిల్లల/తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. 

    2. బాలల సదనాలు

    రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడిచే చిల్డ్రన్ హోమ్స్, అబ్జర్వేషన్ హోమ్స్ ఈ పథకం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ చేరిన పిల్లలకు ఉచిత వసతి, నాణ్యమైన భోజనం, విద్యా సౌకర్యాలు, వైద్య సహాయం అందిస్తారు. ఏపీలో ఈ హోమ్‌ల పర్యవేక్షణకు ప్రత్యేక తనిఖీ బృందాలు పనిచేస్తాయి.

    3. చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు & జువెనైల్ జస్టిస్ బోర్డులు 

    ఏపీలోని అన్ని జిల్లాల్లో బాలల సంక్షేమ కమిటీలు పనిచేస్తున్నాయి. రక్షణ అవసరమైన పిల్లలను గుర్తించి వారిని హోమ్‌లకు పంపాలా లేదా స్పాన్సర్‌షిప్ ఇవ్వాలా అనేది ఈ కమిటీలే నిర్ణయిస్తాయి. చట్టపరమైన చిక్కుల్లో పడిన బాల నేరస్థుల కౌన్సెలింగ్, సంస్కరణల కోసం జువెనైల్ జస్టిస్ బోర్డులు పనిచేస్తాయి. 

    లబ్ధిదారులు ఎవరు? 

    • కోవిడ్ మహమ్మారి సమయంలో తల్లిదండ్రులు ఇద్దరినీ లేదా సంపాదించే వ్యక్తిని కోల్పోయిన పిల్లలకు ప్రాధాన్యత
    • భర్త చనిపోయి లేదా వదిలేసి, ఆర్థికంగా పిల్లలను పోషించలేని స్థితిలో ఉన్న మహిళల పిల్లలు 
    • తల్లిదండ్రులు హెచ్‌ఐవీ, క్యాన్సర్ లేదా ఇతర తీవ్రమైన జబ్బులతో బాధపడుతూ పిల్లల పోషణ చూసుకోలేని కుటుంబాలు
    • ఇటుక బట్టీలు, హోటళ్లు, ఇతర పనుల నుంచి రక్షించిన బాలలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో తిరిగే అనాథ పిల్లలు

    దరఖాస్తు చేసుకునే విధానం  

    • స్థానిక అంగన్‌వాడీ కార్యకర్త లేదా సూపర్‌వైజర్ ద్వారా ప్రాథమిక సమాచారం సేకరించి దరఖాస్తు చేసుకోవచ్చు.
    • మీ పరిధిలోని చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO) ఆఫీసులో అప్లికేషన్ సమర్పించాలి.
    • జిల్లా కేంద్రంలో ఉండే జిల్లా బాలల రక్షణ అధికారి ఆఫీసులో నేరుగా సంప్రదించి, అవసరమైన పత్రాలు (ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, బోనఫైడ్ సర్టిఫికేట్, తల్లిదండ్రుల మరణ ధృవీకరణ పత్రాలు) సమర్పించాల్సి ఉంటుంది.
    Click here to Read More
    Previous Article
    EPFO Update 2026: లైవ్‌లోకి వచ్చిన EPFO ​​వెబ్‌సైట్! PF క్లెయిమ్,పాస్‌బుక్ సర్వీస్‌లో వచ్చిన మార్పులేంటీ?
    Next Article
    Kidney Cancer : నగరవాసుల్లో పెరుగుతోన్న కిడ్నీ క్యాన్సర్ కేసులు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తోన్న ఆంకాలజిస్ట్

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment