Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    AP: టాటా-ఎర్నాకుళం రైలులో మంటలు.. ఒకరు సజీవ దహనం?

    1 month ago

    అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. సుమారు 1.30 గంటల సమయంలో దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్తున్న టాటా-ఎర్నాకుళం (18189) ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. ఎక్స్‌ప్రెస్‌లో ప్యాంట్రీ కారు పక్కనే ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో మంటలు అంటుకున్నాయి. ఆ వెంటనే లోకో పైలట్లు ఈ విషయాన్ని గుర్తించి.. ఎలమంచిలి సమీపంలోని ఒక పాయింట్ దగ్గర ఎక్స్‌ప్రెస్ రైలును నిలిపివేశారు.

    బీ1 ఏసీ బోగీ బ్రేకులు పట్టేయడంతో మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు

    వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.. కానీ వారు వచ్చేలోపే రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి.ఈ టాటా-ఎర్నాకుళం (18189) ఎక్స్‌ప్రెస్ రైలు అనకాపల్లికి నాలుగు గంటలు ఆలస్యంగా చేరుకుంది. నర్సింగబల్లి వద్ద బీ1 ఏసీ బోగీ బ్రేకులు పట్టేయడంతో మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. అయితే అగ్నిమాపక సిబ్బంది అనకాపల్లి, ఎలమంచిలి, నక్కపల్లి నుంచి వచ్చారు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
    ప్రమాదంలో రెండు బోగీల్లోని ప్రయాణికుల సామాగ్రి మొత్తం కాలిపోయింది. వెంటనే అంబులెన్స్‌లను రప్పించారు.. దాదాపుగా 2వేల మంది ప్రయాణికులు స్టేషన్‌లోనే ఉండిపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత, రైల్వే అధికారులు కాలిపోయిన రెండు బోగీలను తొలగించారు. మిగిలిన బోగీల్లో ప్రయాణికులను సర్దుబాటు చేసి, రైలును ముందుకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు.ఈ ఘటనలో ఒకరు సజీవ దహనం అయ్యారు.అయితే మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

    Click here to Read More
    Previous Article
    YCP : జగన్ అంతా తెలుసు అనుకుంటారు – లోకేశ్
    Next Article
    AP: నేడు ఏపీ కేబినేట్ సమావేశం

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment