Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Crime 2025:నేరాల్లో మహిళల పాత్ర: దేశాన్ని కుదిపేసిన సంచలన కేసులు

    1 month ago

    2025 సంవత్సరం(Crime 2025) ముగింపు దశకు చేరుకుంటున్న వేళ, ఈ ఏడాది చోటుచేసుకున్న కొన్ని నేరాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఈ ఘటనల్లో మహిళలు కీలక పాత్ర పోషించడం సంచలనంగా మారింది.

    2025లో వార్తల్లో నిలిచిన ప్రధాన కేసులు

    • కన్నడ సినీ నటి రన్యారావు భారీగా బంగారం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడటం కలకలం రేపింది. ఆమె వద్ద నుంచి సుమారు రూ.17 కోట్ల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
    • నేవీ అధికారిని అతని భార్య, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసి, శవాన్ని డ్రమ్‌లో ఉంచి సిమెంట్‌తో మూసివేయడం దేశవ్యాప్తంగా షాక్‌కు గురిచేసింది.
    • సోనమ్ రఘువంశీ తన భర్తను హనీమూన్ నెపంతో మేఘాలయకు తీసుకెళ్లి, అక్కడ కిరాయి హంతకులతో హత్య చేయించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
    • జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేసినట్టు నిర్ధారణ కావడంతో ఆమెను అరెస్ట్ చేశారు.
    • డాక్టర్ షాహీన్ సయీద్, ఇతర వైద్యులతో కలిసి దేశవ్యాప్తంగా భారీ ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి.

    సమాజాన్ని ఆలోచింపజేసిన ఘటనలు

    ఈ కేసులు మహిళల పాత్రపై(Crime 2025) కొత్త చర్చకు తెరలేపాయి. నేరాలు లింగభేదం లేకుండా జరుగుతాయని, చట్టం ముందు అందరూ సమానమే అన్న అంశాన్ని ఈ సంఘటనలు మరోసారి గుర్తుచేశాయి.

    Click here to Read More
    Previous Article
    Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌లు
    Next Article
    HD Revanna : కేసు లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి విముక్తి | బెంగళూరు కోర్టు తీర్పు

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment