Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!

    1 month ago

    Maoist Latest News: మావోయిస్టుపార్టీ కీలకనేత బరిసెదేవా లొంగుబాటు పెను సంచలనంగా మారింది. హిడ్మా తరువాత అత్యంత సమర్ధుడైన కీలకనేత మావోయస్టుపార్టీకి ఊహించని దెబ్బకొట్టారు.

    Maoist Latest News: తెలంగాణ డీజీపీ సమక్షంలో మావోయిస్టు పార్టీ కీలక నేత బరిసెదేవా లొంగుబాటు, ఇప్పటికే కొన ఊపిరితో పోరాడుతున్న మావోయిస్టు ఉద్యమానికి బిగ్ షాక్‌గా చెప్పవచ్చు. బరిసెదేవాతోపాటు 19మంది మావోయిస్టులు దశాబ్దాల పోరటానికి గుడ్ బై చెప్పి, కారడవులు దాటి,ఆయుధాలు వదలి జనజీవన శ్రవంతిలోకి రావడంతోపాటు భారీ స్టాయిలో ఆయుధాలను అప్పగించడం సంచలనంగా మారింది. మావోయిస్టుల అంతమే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ చేపట్టిన కేంద్రం ,వ్యూహాత్మకంగా ముందుకు దూసుకుపోతోంది. చర్చలు, కాల్పుల విరమణ ప్రకటనలు ఏ మాత్రం లెక్క చేయకుండా మావోయిస్టుల ఏరివేత ధ్యేయంగా అడవులను జల్లెడ పడుతూ ,లక్ష్యానికి అత్యంత చేరువలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా మావోయిస్టు పార్టీ కీలక నేత బరిసెదేవా దళం లొంగుబాటు మాత్రమేకాదు, ఆపరేషన్ కగార్ తరువాత ఇంత భారీ మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్న దాఖలాలులేవు. 

    మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ ఛీఫ్‌గా బరిసెదేవా కొనసాగుతున్నారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మావోయిస్టులు కీలక నేతలు లొంగిపోవడంతోపాటు 48 మౌంటెడ్ LMG వెపన్స్ అప్పగించనున్నారు. బరిసెదేవా వద్ద ఉన్న 20లక్షల రూపాయల నగదు సైతం SIBకి అప్పగించడంతో, కేంద్ర హోమ్ శాఖ సైతం SIBపై ప్రశంసల జల్లు కురిపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే డీజీపీ వద్ద ఇంత మొత్తంగా ఆయుధాలతో లొంగిపోవడం ఇటీవల కాలంలో ఇదే ప్రథమంగా చెప్పవచ్చు.

    హిడ్మా ఎన్ కౌంటర్ తరువాత గెరిల్లా లిబరేషన్ ఆర్మీ బాధ్యతలు ఇటీవల బరెసెదేవాకు అప్పగించింది మావోయిస్టు పార్టీ. గెరిల్లా దాడులు, వ్యూహాలు రచించడంలో హిడ్మాకు ధీటుగా బరిసెదేవా పనిచేశారు. ఇద్దరూ ఒకే గ్రామం నుంచి రావడంతోపాటు హిడ్మాను దగ్గర చూస్తూ, వ్యూహాలను అందిపుచ్చుకున్న దేవా, దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీలో పలు కీలక ఆపరేషన్లలో పాల్గొన్నాడు. ఎన్నో గెరిల్లా దాడులు విజయవంతంగా నిర్వహించాడు. సాయుధ బలగాల వ్యవహారాలు చూసుకోవడంతోపాటు, మావోయిస్టులకు అవసరమైన ఆయుధ సంపత్తిని అందించడంలో కీలకపాత్ర పోషించాడు దేవా. హిడ్మా మరణం తరువాత నైరాశ్యంలో ఉన్న మావోయిస్టు పార్టీకి టార్చ్‌బేరర్ లా కనిపించిన బరిసెదేవా, బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజుల్లోనే డీజీపీ ఎదుట లొంగిపోవడం ఆసక్తిగా మారింది. 

    కేంద్రం విధించిన డెడ్ లైన్ దగ్గర పడుతున్న వేళ మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరిగా లొంగిపోవడం, మిగతా వారు ఎన్ కౌంటర్లలో మరణించడంతో అడవిలో మిగిలిన అన్నల పరిస్ధితి అత్యంత క్లిష్టతరంగా మారింది. ఈ ఏడాది మార్చి నాటికి అంటే మరో మూడు నెలల్లో మావోయిస్టు రహిత దేశంగా భారత్ మారుస్తామంటూ అమిత్ షా చేసిన ప్రకటన కార్యరూపం దాల్చేందుకు అత్యంత చేరువలో జరుగుతున్న వరుస పరిణామాలు కనిపిస్తున్నాయి.

    Click here to Read More
    Previous Article
    ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
    Next Article
    AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment